Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'జై సమైక్యాంధ్ర' అంటున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
రాష్ట్రంలో రగులుతున్న సమైఖ్యాంద్ర,తెలంగాణ ఇష్యూలపై మొదటిసారిగా నోరు విప్పారు ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఈ విషయమై ఓ పత్రికా ప్రకటన చేసారు. అందులో..'రాజకీయాలు, సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల గురించి నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా ఉండాలని రాజగోపాల్ ప్రగాఢంగా నమ్ముతున్నారంటే దానిని నేను కూడా నమ్ముతున్నాను' అని ఆయన పేర్కొన్నారు. 'నేను, లగడపాటి' పేర ఆయన పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. చివరలో 'జై సమైక్యాంధ్ర' అని లేఖను ముగించారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో తనకు జూనియర్ అయిన ప్రస్తుత ఎంపీ రాజగోపాల్ తో అనుబంధం గుర్తు చేసుకున్నారు. తాను రాజ్ గోపాల్ ని మొదటిసారి చూసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న అనుబంధాన్ని ఆయన లేఖలో తెలిపారు. ఒకసారి రాజగోపాల్ కాలేజీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు ఎందుకు ఎన్నికల్లో దిగుతున్నావు అని అడిగితే..'ప్రజలకు సేవ చేయడానికి పదవి అవసరం లేదు, కానీ పదవి ఉన్నపుడు సమస్యల్లో ఉన్న ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండవచ్చు' అని లగడపాటి సమాధానం ఇచ్చారనీ, ఆయన ఇచ్చిన సమాధానం అందులో స్పష్టత చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లగడపాటిని టీవీలో చూశానని 25 ఏళ్ల నాటి రాజగోపాల్ను చూసినట్లుందని పేర్కొన్నారు. లగడపాటి కళ్లలో అదే నిజాయతీ, జిజ్ఞాస, ధైర్యం, ద్రుఢత్వం ఇప్పటికీ ఉన్నాయని రామ్గోపాల్వర్మ పేర్కొన్నారు.ఇక రామ్ గోపాల్ వర్మ తొలి సంచలనాత్మక చిత్రం శివ..సిద్దార్ధ కాలేజీలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగానే తయారు చేసుకున్నట్లు వర్మ ఎప్పుడూ చెప్తూండటం తెలిసిందే.