'అప్పల్రాజు' సీక్వెల్ తీయటానికి లాజిక్ చెప్పిన వర్మ
రామ్ గోపాల్ వర్మ తాజా ఫ్లాప్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పల్రాజు చిత్రానికి ఆయన సీక్వెల్ తీస్తానంటున్నారు. సునీల్ హీరోగా చేసిన ఈ చిత్రం ప్లాప్ కావటంతో అంతటా రకరకాల విమర్శలు వినిపిస్తున్న నేఫద్యంలో వర్మ ఇలా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..నాగార్జున తో చేసిన అంతం ప్లాప్ కాగానే అదే లైన్ ని కొద్దిగా మార్చి సత్య చేసాను. అది పెద్ద హిట్. అలాగే దెయ్యం చిత్రం ప్లాప్ కాగానే దాన్నే మార్చి భూత్ అని తీసాను. అది హిట్. అందుకే అప్పల్రాజు సీక్వెల్ కూడా తీస్తాను. నా తప్పులను సరిచేసుకుంటాను అంటున్నారు.
ఈ చిత్రం ప్లాప్ టాక్ రావటంతో దాదాపు 32 నిముషాల సేపు కట్ చేసి 2 గంటల 41 నిముషాల సినిమాని 2 గంటల తొమ్మిది నిముషాలకు కుదించారు. అయినా ఎక్కడా రెస్పాన్స్ లేదని తెలుస్తోంది. 12 సంవత్సరాల తర్వాత వర్మ రూపొందించిన ఈ చిత్రం టాలీవుడ్ పై సెటైర్స్ తో రూపొందింది. అయితే ఆ సైటైర్స్ సిని పరిశ్రమకు చెందినవారిపై కావటంతో సామాన్య ప్రేక్షకులకు అవి అర్దం కాక ఎవరూ ఐడింటిఫై చేసుకోలేకపోయారని అదే ప్లాపుకు కారణమని చెప్తున్నారు.
వర్మ "అప్పలరాజు" రీడర్స్ పోల్ రిజల్ట్ ఏమిటి?


Click it and Unblock the Notifications











