Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెప్పర్ స్ర్పే: లగడపాటిపై వర్మ ప్రశంసలు
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా నిండు సభలో ఎంపీలపై పెప్పర్ స్ర్పే చల్లిన కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అందరినీ భయ భ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పార్లమెంటు చరిత్రలో ఇదొక మాయని మచ్చ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే లగడపాటి స్నేహితుడు, వివాదాస్పద దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మాత్రం రాజగోపాల్ చర్యను సమర్థించారు. ఈ మేరకు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసారు. రాజగోపాల్ను వర్మ భగత్ సింగ్తో పోల్చారు. 'భగత్ సింగ్ తర్వాత పార్లమెంటును షాక్కు గురి చేసింది రాజగోపాల్ మాత్రమే. భగత్ సింగ్ భారత్ కోసం...రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ కోసం చేసాడు' అంటూ ట్వీట్ చేసారు.
ఇప్పటి వరకు పెప్పెర్ స్ర్పేకు పెద్దగా పాపులారిటీ లేదు. పార్లమెంటులో జరిగిన చర్యతో పెప్పర్ స్ప్రేకు పాపులారిటీ బాగా పెరిగింది. ఇకపై చాలా మంది దీన్ని ఆయుధంగా ఉపయోగించే అవకాశం ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. పెప్పర్ స్ప్రే వాడటం చట్టబద్దమే. ఇకపై చాలా మంది దీన్ని ఉపయోగిస్తారు అని అభిప్రాయ పడ్డారు.
భవిష్యత్తులో క్లాసు రూములు, మూవీ థియేటర్లు, షాపింగు మాల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెప్పర్ స్ప్రేలు వాడిన సంఘటనలు మనం చూడబోతున్నాం అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.