Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తిరుపతి లడ్డూపై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్య
హైదరాబాద్: మాగి నూడుల్స్ మీద దేశ వ్యాప్తంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హానికారక రసాయనాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో వీటిని బ్యాన్ చేసారు కూడా. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం మాగీకి మద్దతుగా నిలిచాడు. అంతే కాదు...తిరుపతి లడ్డూను ఎవరైనా టెస్ట్ చేయగలరా? రోడ్డు పక్కన ఉండే వందలాది హోటల్స్ మీద బ్యాన్ చేయగలరా?...ఎంఎన్సి కంపెనీలను సాఫ్ట్ టార్గెట్ చేస్తున్నారు... అంటూ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
Does
anybody
test
Turupathi
laddus?
Or
any
of
the
100s
of
roadside
hotels
?
Mnc's
are
just
soft
targets...reminds
me
of
KFC
targeting
days
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
June
3,
2015
అత్యంత ప్రమాదకరం అయిన సిగరెట్లు, ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మాగీ మీద మాత్రం బ్యాన్ విధించారు. సూపర్బ్ అంటూ వర్మ ట్వీట్ చేసారు.
వర్మ సినిమాల విషయానికొస్తే... సచిన్ జోషి కథానాయకుడిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మొగలిపువ్వు'. మీరా చోప్రా, కైనత్ అరోరా కథానాయికలు. జెడ్3 పిక్చర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జీత్ గంగూలీ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలాండ్ లో చిత్రీకరణ జరుపుకుటుంది. సీజర్ గొంజాలేస్ కోరియోగ్రఫీలో సచిన్ జోషి, మీరా చోప్రాలపై ఇటివలే ఓ శృంగారాత్మక గీతాన్ని తెరకెక్కించారు. వర్మ మార్క్ రొమాంటిక్ టచ్ ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణ.
Maggi
should
demand
a
check
on
our
ultra
clean
fish
markets
and
also
our
highly
hygienic
road
side
eateries
before
discriminating
it
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
June
3,
2015
ఓ సినిమా చిత్రీకరణ కోసం పదిహేనేళ్ళ తర్వాత వర్మ విదేశాలకు వెళ్ళడం విశేషం. చివరిసారిగా 2000లో 'మస్త్' చిత్రంలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళారు. ఆ తర్వాత 'మొగలిపువ్వు' వర్మను విదేశాలకు తీసుకెళ్ళింది.
వివాహిత వ్యక్తి ఓ మహిళతో పెట్టుకున్న సంబంధం ఎంత దూరం వెళ్ళింది. అక్రమ సంబంధాలు, వాటిలో సెల్ ఫోన్ పాత్ర ఎంతుంది అనే పాయింట్ మీద వర్మ థ్రిల్లర్ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. 'ప్రతి పెళ్ళైన మగాడి సెల్ ఫోనులో భార్యకు తెలియని సీక్రెట్ ఉంటుంది' అంటూ సెల్ ఫోనును విలన్ చేసేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.