Don't Miss!
- News Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టీడీపీ చచ్చిపోయింది, వెన్నుపోటు ఫలితమే: రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్
2019 ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకపక్షంగా సాగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార తెలుగు దేశం పార్టీకి ఘోర పరాజయం తప్పదని స్పష్టం అవుతోంది.
ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో సంచలన ట్వీట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీపై కసితీరా కామెంట్లు గుప్పించారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఫన్నీ ట్వీట్స్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
|
టీడీపీ చచ్చిపోయింది
పేరు: టీడీపీ
జననం:
మార్చి
29,
1982
మరణం:
మార్చి
23,
2019
మరణానికి
కారణం:
అబద్దాలు
చెప్పడం,
వెన్నుపోటు
పొడవటం,
అవినీతి,
అసమర్ధత,
వైఎస్
జగన్,
నారా
లోకేష్
అంటూ
వర్మ
ట్వీట్
చేశారు.
2019
ఎన్నికల
ఫలితాల్లో
మొత్తం
175
స్థానాలకుగాను
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీ
150
స్థానాల్లో
అధిక్యంలో
కొనసాగుతుండగా,
తెలుగు
దేశం
పార్టీ
కేవలం
25
స్థానాల్లో
ముందంజలో
ఉంది.
|
సైకిల్ టైరు పంక్చర్
మరో ట్వీట్లో వర్మ... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఫన్నీ ట్వీట్ చేశారు. ఆయన సైకిల్ పంక్చర్ అయినట్లుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వర్మ అభిమానులు ఈ ట్వీట్లను రీట్వీట్ చేస్తూ తమ ఆనందం ప్రదర్శిస్తున్నారు.
|
ఎన్టీఆర్కు ఏం చేశానో గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఒకప్పుడు తన మామ ఎన్టీ రామారావును గద్దెదింపి తాను అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీన్ని కొందరు చంద్రబాబు వెన్నపోటుగా అభివర్ణించారు. ఆ పరిస్థితులను చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నాడంటూ వర్మ ట్వీట్ చేశారు.
|
నన్ను వదిలేయండి, ఇంకెప్పుడూ సర్వేలు చేయను
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో లగడపాటి సర్వే తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అయితే ఈ సర్వే పూర్తిగా తారుమారైంది. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్ను ఉద్దేశించి వర్మ ఇలా ఫన్నీట్వీట్ చేశారు.