Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పసిబిడ్డ ప్రాణం కాపాడిన రామ్...సమంత ప్రశంసలు
హైదరాబాద్: తెరమీదే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు హీరో రామ్. ఆయన వంతుగా చేసిన సాయం ఓ పసివాడి ప్రాణం రక్షించింది. వివరాల్లోకి వెళితే...శ్రవణ్ కార్తీక్ 6 నెలల బిడ్డ, తనకి హార్ట్ డిసీస్ ఉండడం వల్ల తను ఆంధ్ర హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాబుకి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు కానీ ఆ బాబు తల్లి తండ్రులకు అంత స్తోమత లేదు. దాంతో సమంత నిర్వహించే ప్రత్యూష ఆర్గనైజేషన్ వారు అందరినీ శ్రవణ్ ని కాపాడమని కోరారు.
అప్పుడే హీరో రామ్ ముందుకు వచ్చి తన వంతుగా ఆ పసివాడి ఆపరేషన్ కి సరిపడా మనీ ఇచ్చి సాయం చేసాడు. ఈ విషయం గురించి,రామ్ మంచితనం గురించి సమంత తన ట్విట్టర్ ద్వారా మెచ్చుకోవడమే కాకుండా, కృతఙ్ఞతలు చెప్పింది. దాంతో రామ్ సంతోషపడటమే కాకుండా ప్రత్యూష లాంటి ఓ ఆర్గనైజేషన్ ని నడుపుతున్నందుకు ఆమెను మెచ్చుకున్నాడు.
ఇక రామ్ చిత్రాల విషయానికి వస్తే...
రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్ ప్రీత్సింగ్ నాయిక. గోపీచంద్ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.
Such
a
beautiful
morning
thanks
to
@ramsayz,
for
helping
@PratyushaOrg
help
the
child
we
requested
for
help
for.
Lovely
person
you
are
—
Samantha
Ruth
Prabhu
(@Samanthaprabhu2)
December
27,
2014
రామ్ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్.
రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్.
చిత్రంలో సాయికుమార్, రావు రమేష్, జయప్రకాశ్రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్.ప్రకాశ్.