Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
శివరాత్రి జాగారంలో డాన్ శీను పాట.. రైటర్, డైరెక్టర్ ట్వీట్స్ వైరల్
గోపిచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ అంటే బలుపు, డాన్ శీను వంటి మాస్ ఎంటర్టైనర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు చిత్రాలు మాస్ మహారాజ్కు మంచి మైలేజ్ఇచ్చాయి. అటు హీరోగా రవితేజకు, ఇటు దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా ఓ ప్రాజెక్ట్ను రెడీ చేశారు. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కించడానికి క్రాక్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నేటికి డాన్ చిత్రం విడుదలై.. పదేళ్లు కావొస్తోంది. ఈ మేరకు డాన్ శీను చిత్రం గురించి దర్శకుడు, పాటల రచయిత నాటి విశేషాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పదేళ్ల డాన్ శీనుపై గోపీచంద్ మలినేని స్పందిస్తూ.. మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ మీరు డైరెక్టర్గా నాకు జన్మను ఇచ్చారు. ఎప్పుడూరుణపడే ఉంటాను. నా జీవితాంతం డాన్ శీను చిత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంద'ని ట్వీట్ చేశాడు.
ఇక పాటల రచయిత రామ జోగయ్యశాస్త్రి ఈ చిత్ర విశేషాల గురించి చెబుతూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. గుర్తుందా గోపీ..మణిశర్మ అన్నయ్యతో కంపోజింగ్..శివరాత్రి జాగారంలో ఒక పాట పూర్తి చేశాం...డాన్ శీను వచ్చి అప్పుడే 10 ఏళ్లయిందా అంటూ రామ జోగయ్య ట్వీట్ చేయగా.. ఎలా మరిచి పోతాం శాస్త్రి గారు!! అడుగడుగున నాతో ఉన్నందుకు సదా కృతజ్ఞుడిని అంటూ గోపీచంద్ రిప్లై ఇచ్చాడు. ఇక అభిమానులు మాత్రం క్రాక్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.