Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రామానాయుడు ఇన్ యాక్షన్
వందకు పైగా చిత్రాలు నిర్మించి ఇంకా అలుపెరగని శ్రామికుడిగా సినీ నిర్మాణంలో తలమునకలవుతున్న ప్రముఖులు డి. రామానాయుడు. సినిమా ద్వారా తను సంపాదించిన డబ్బును తిరిగి పరిశ్రమ మీదనే ఖర్చు చేసి.. ఆదర్శ నిర్మాతగా ఎదిగిన ఆయన కొద్దికాలం పాటు వరుస వైఫల్యాలు తగిలి సినీ నిర్మాణాన్ని ఆపేశారు. అయితే, క్రియాశీలక రాజకీయాల నుంచి విరామం తీసుకున్న ఆయన తిరిగి తన శక్తియుక్తులన్నీ సినీ నిర్మాణం కోసమే ఉపయోగించే పనిలో పడ్డారు.
హోప్ చిత్రం ద్వారా మంచి నటుడు కూడా అని నిరూపించుకున్న రామానాయుడు - ఆ స్ఫూర్తితో ఒక ఫుల్ లెంగ్త్ కమర్షియల్ పాత్ర చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్రయోగం కూడా ఆయన స్వీయనిర్మాణంలోనే తలపెట్టడం విశేషం. రామానాయుడు నిర్మాతగా ఆయన తనయుడు వెంకటేశ్ హీరోగా గాడ్ఫాదర్ అనే కథను తెరకెక్కించడానికి రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు.
భూపతిరాజా చెప్పిన ఒక కథ ఆయనకు బాగా నచ్చి, హీరోగా వెంకటేశ్ చేస్తే తండ్రిగా తనే నటించడానికి రామానాయుడు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రామానాయుడు సుమంత్ హీరోగా స్నేహ, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా రామానాయుడు ఒక చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబోతున్నారు. అది పూర్తయిన వెంటనే వెంకటేశ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. నిజజీవితంలో సుప్రసిద్ధులైన తండ్రీకొడుకులు ఇద్దరూ తొలిసారి నటించే చిత్రం ఇదే అయితే.. అంతకన్నా విశేషం ఏముంటుంది?