Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సురేష్ బాబు నాలా కాదు
సురేష్ నాకంటే కచ్చితంగా ఉంటాడు. నేను మొహమాటం కొద్దీ సినిమాలు ఒప్పుకొని డబ్బులు పోగొట్టుకొన్న సందర్భాలున్నాయి. సురేష్ అలా కాదు... 'రూపాయి కూడా పోకూడదు డాడీ. రిస్క్ తీసుకోలేను' అంటాడు అంటూ చెప్పుకొచ్చారు రామానాయుడు. ఆయన తన తాజా చిత్రం ముగ్గురు ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.అలాగే ఇప్పటి నిర్మాత పరిస్ధితి మారిపోయిందని చెప్తూ... అప్పుడు నిర్మాతకు బాధ్యతలెక్కువ. సినిమా పోతే పంపిణీదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అందుకే కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. ఓ దర్శకుడు, ఓ నిర్మాత కలిసి హీరోని వెతికేవారు. ఇప్పుడు అలా కాదు... హీరో, నిర్మాత కలిసి దర్శకుడిని వెతుకుతున్నారు. నిర్మాత చెక్కుల మీద సంతకాలు చేయడానికి మాత్రమే కాదు.కథలో అతని ప్రమేయం తప్పకుండా ఉండాలి అన్నారు.రామానాయుడు నిర్మించిన 140వ చిత్రం 'ముగ్గురు'. ఈ నెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వియన్ ఆదిత్య దర్శకత్వంలో 'ముగ్గురు'రూపొందింది.