Don't Miss!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సురేష్ బాబు నాలా కాదు
సురేష్ నాకంటే కచ్చితంగా ఉంటాడు. నేను మొహమాటం కొద్దీ సినిమాలు ఒప్పుకొని డబ్బులు పోగొట్టుకొన్న సందర్భాలున్నాయి. సురేష్ అలా కాదు... 'రూపాయి కూడా పోకూడదు డాడీ. రిస్క్ తీసుకోలేను' అంటాడు అంటూ చెప్పుకొచ్చారు రామానాయుడు. ఆయన తన తాజా చిత్రం ముగ్గురు ప్రమోషన్ లో కలిసిన మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు.అలాగే ఇప్పటి నిర్మాత పరిస్ధితి మారిపోయిందని చెప్తూ... అప్పుడు నిర్మాతకు బాధ్యతలెక్కువ. సినిమా పోతే పంపిణీదారులకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. అందుకే కథ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు. ఓ దర్శకుడు, ఓ నిర్మాత కలిసి హీరోని వెతికేవారు. ఇప్పుడు అలా కాదు... హీరో, నిర్మాత కలిసి దర్శకుడిని వెతుకుతున్నారు. నిర్మాత చెక్కుల మీద సంతకాలు చేయడానికి మాత్రమే కాదు.కథలో అతని ప్రమేయం తప్పకుండా ఉండాలి అన్నారు.రామానాయుడు నిర్మించిన 140వ చిత్రం 'ముగ్గురు'. ఈ నెల 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వియన్ ఆదిత్య దర్శకత్వంలో 'ముగ్గురు'రూపొందింది.