Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నేను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు : రమాప్రభ
నేటి సిని పరిస్దితులని విశ్లేషిస్తూ..ఆనాటి పరిస్ధితులని వివరించారు. ఆమె మాటల్లోనే.... కథను పాత్రను అర్థం చేసుకుని ఎవరికి వారు చేసుకుంటూ పోయేవారం. సినిమాలో పాత్రలు పండాలంటే నటీ నటులు ముందు ఇగోను పక్కన పెట్టాలి. హాస్యనటులతో పనిచేస్తున్నా మా రోజుల్లో ఎవరిలోనూ ఇగోలుండేవి కావు. అసలా పదమే మాకు తెలియదు. ఎవరికి వారం పాత్రలో లీనమయ్యేవారం. ఎదుటి వారి డైలాగులు ఎలా ఉన్నాయి, నా డైలాగులు ఎలా ఉన్నాయి అనే పోలిక ఉండేది కాదు అన్నారు.
ఇక ఒక్కోసారి సీనియర్ నటులు తమ పాత్రను తాము చక్కగా చేసుకుంటూ పోతున్నా, దర్శకులు మధ్యలో కట్ చెప్పిన సందర్భాలున్నాయి. వారి పాటికి వారు చేసుకుంటూ పోతే దర్శకునిగా నా గుర్తింపేంటనే భావనతో అలా చేసేవారు. ఇప్పుడీ పోకడ నటులు ప్రదర్శిస్తున్నారు. ఇగో ఎక్కువైపోయి, తమకిచ్చిన పాత్రపై కంటే ఎదుటి వారికిచ్చిన పాత్రపైన, డైలాగులపైనే దృష్టి పెట్టడంతో సీను కృతకంగా మారిపోతోంది. నిజానికి నైపుణ్యం లేనివారే ఇగో ప్రదర్శిస్తారు అని తేల్చి చెప్పారు.
తన రోజుల్లో కామెడీ అనేది కుటుంబాల్లో ఒక భాగంగా ఉండేదని అన్నారు. రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి, రాజబాబు- రమాప్రభ... ఇలా హాస్యజంటలు ఉండేవి. ఈ పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఏమి ఇవ్వాలో నటులకు తెలుసు, వారికేమి కావాలో ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం ఈ రెండూ కరువయ్యాయి. ఉరుకు పరుగుల జీవితం నుండి కొంత రిలాక్సేషన్ కోసం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నిర్దిష్టంగా ఇది కావాలని ప్రజలు ఆశించడం లేదు. దీంతో పరిశ్రమలోని వారు సైతం ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేస్తే చాలులే అనుకుంటున్నట్లు అనిపిస్తోంది అన్నారు.