Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రామయ్యా వస్తావయ్యా’ కర్నాటక రైట్స్ కేక!
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కేవలం మన రాష్ట్రంలోనే కాదు...పొరుగురాష్ట్రాల్లోనూ విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం కర్ణాటక రైట్స్ జూనియర్ కెరీర్లో రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
గతంలో జూనియర్ నటించిన దమ్ము, బాద్ షా చిత్రాలు ఇక్కడ మంచి ఫలితాలు రాబట్టాయి. ఈ నేపథ్యంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కర్ణాటక రైట్స్ రూ. 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. బృందా అసోసియేట్స్ వారు కర్ణాటకలో ఈచిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కథానాయకుడుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శృతి హాసన్ కథానాయికలు. తమన్ సంగీతం అందించారు. అక్టోబర్ 10వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...'మా నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో 2008 అక్టోబర్ 9న 'కొత్తబంగారు లోకం', 2010 అక్టోబర్ 14న 'బృందావనం' విడుదలయి సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు 2013 అక్టోబర్ 10న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్తో హాట్రిక్కి సిద్ధమవుతున్నాము' అన్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తీరు తెన్నులు కొత్తగా తీర్చిదిద్దారని, తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయని, ఆడియోని ఈ వారంలో నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని తెలిపారు.
ఇటీవల విడుదల చేసిన టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయని, బృందావనం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయిన ఎన్టీఆర్ ఈ చిత్రంతో యూత్ ఆడియన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువవుతారని దిల్ రాజు తెలిపారు.