Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇక బుల్లి తెరపై కంటిన్యూగా రంభ చిందులు
హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ త్వరలో ఈటీవీ ఛానెల్ రెగ్యులర్ గా కనిపించటానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకుందని సమాచారం. ఈటీవీలో పాపులర్ అయిన ఢీ పోగ్రామ్ కి ఆమె జడ్జిగా రానుంది. అయితే ఈ డీ పోగ్రామ్ లేడీస్ స్పెషల్ గా రూపొందిస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారం నుంచి ప్రతీ గురువారం రాత్రి 9:30 నుంచి 10:30 వరకూ ఈ పోగ్రాం వస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ పోగ్రామ్ లో యాంకర్ గా ఉదయభాను వ్యవహిస్తుంది. బ్రాండ్ అంబాసిడర్ గా శ్రియను అడుగుతున్నారు. మొత్తానికి ఈ పోగ్రామ్ కి పూర్తి స్ధాయి సినిమా హంగులు అద్ది రేటింగ్ లు పెంచే ప్రయత్నంలో ఉంది యాజమాన్యం. ఇక రంభ వివాహం కూడా ఏప్రియల్ ఎనిమిదిన తిరుపతి లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక రంభను ఈ పోగ్రామ్ కి తీసుకోవటానికి కారణం గ్లామర్ అనేదే కాక ఆమె డాన్స్ ప్రావీణ్యం కూడా అని తెలుస్తోంది. అంటే పోగ్రామ్ లో రంభ నృత్యాలు స్పెషల్ గా ఉంటాయన్న మాట.