Don't Miss!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
సర్వాంగ సుందరంగా రంభ వివాహం నేడే
ప్రముఖ సినీ నటి రంభ వివాహం తిరుమల పుణ్యక్షేత్రంలో ఈ రోజు(గురువారం) ఉదయం 11.44 గంటలకు జరగనుంది. కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ తో జరగనున్న వివాహానికి కర్ణాటక కళ్యాణ మండపం వేదిక కానుంది. ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అవుతున్నారు. ఇక కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంభ కుటుంబీకులు నలభై మంది బుధవారం ఉదయం తిరుమల చేరుకుని శ్రీ పద్మావతి అతిథిగృహ ప్రాంతంలో బసచేశారు. ఈ ఆరునెలల వ్యవధిలో హీరోయిన్లు మీనా, శ్రీదేవిల వివాహాలు తిరుమలలోనే జరిగాయి. ఇక రంభ పెళ్లి లైవ్ హక్కులను ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ వారు భారీ మొత్తానికి తీసుకున్నారని సమాచారం.
ఇక రిసెప్షన్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. చెన్నైలోని రాణీ మేయమ్మ హాలులో ఈ వేడుక జరుగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. 'రంభ శుభలేఖ' ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. పూర్వకాలం మహారాజుల ఆహ్వాన పత్రిక తరహాలో ఈ శుభలేఖను డిజైన్ చేశారు. జైపూర్ లో ప్రత్యేకంగా ఈ శుభలేఖను డిజైన్ చేయించామని రంభ సోదరుడు వాసు చెప్పారు.అలాగే పెళ్ళయిన తర్వాత రంభ నటిస్తానని చెప్తోంది. రంభకు ధట్స్ తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తోంది.