Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్పుడే ఒకటి ఫినిష్ చేసేసిన రాంచరణ్.. అదిరిపోతుందనే టాక్!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మంచి జోరు మీద ఉన్నాడు. రంగస్థలం చిత్రం బాహుబలి తరువాత టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగానే కాదు నటన పరంగా కూడా రాంచరణ్ ని ఈ చిత్రం మరో లెవల్ లో నిలబెట్టింది. రంగస్థలం విజయం అందించిన ఉత్సాహంతో వెంటనే బోయపాటి చిత్రంలో చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రం సంబందించిన తాజా అప్డేట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఒకటి ఫినిష్ చేసేసిన రాంచరణ్
రాంచరణ్ లేకుండానే బోయపాటి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించడం విశేషం. రాంచరణ్ ఈ చిత్రం కోసం సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఇటీవలే చరణ్ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఇంటర్వెల్ ముందు వచ్చే భారీ ఫైట్ ని చరణ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కణ్ణన్ నేతృత్వంలో చిత్రీకరించిన ఈ ఫైట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం.
బోయపాటి స్టైల్లో
బోయపాటి శ్రీను చిత్రాలు మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటాయి. ఈ చిత్రం కూడా అదేవిధంగా యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉండేలా చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది.
విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. వివేక్, రాంచరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయని, విలన్ గా వివేక్ అద్భుతమైన నటన కనబరుస్తునట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా కైరా అద్వానీ
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కైరా అద్వానీ ఇటీవలే మహేష్ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి చిత్రంతోనే కైరా ఘన విజయం సొంతం చేసుకుంది.