పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి రామ్ చరణ్ ట్వీట్
రామ్ చరణ్ తాజాగా విడుదలైన పంజా ఆడియోని ఉద్దేశించి ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే...కళ్యాణ్ బాబాయ్ కి విషెష్,విష్ణు వర్ధన్ మరియు పంజా టీమ్ కి ఆల్ ది బెస్ట్. మిగతా బాబాయి సినిమాల సంగీతం లాగానే పంజా ఆడియో కూడా సక్సెస్ అవుతుంది.బాబాయ్ కు నా శుభాకాంక్షలు.చైనాలో నేను షూటింగ్ లో బిజీగా ఉన్నాను.నేను ఆడియో ఫంక్షన్ కి మిస్సయ్యాను. మీరంతా ఈవెంట్ ని,మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తున్నాను.పంజాలో పాటలు విన్నాను. అవి సింపుల్లీ సూపర్బ్.ముఖ్యంగా ఓపినింగ్ సాంగ్ గురించి చెప్పుకోవాలి.
మెగా ఫ్యాన్స్ తరుపున యవన్ శంకర్ రాజా కు కంగ్రాట్స్ చెప్తున్నాను అన్నారు. రామ్ చరణ్ ..రీసెంట్ గా జరిగిన పంజా ఆడియో కి రామ్ చరణ్ మరియు మెగా కుటుంబం లో ఎవరూ రాకపోవటంతో మీడియాలో ఇదో చర్చనీయాంశమైంది. దీనికి వివరణగా ఈ ట్వీట్ ని ఆయన చేసినట్లు అర్దమవుతోంది. అయితే ఇంతకుముందే అల్లు అర్జున్,నాగబాబు తాము ఎందుకు పంజా పంక్షన్ కి హాజరు కాలేదో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ..రచ్చ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చైనా లో ఈ చిత్రంకు సంభంధించి ఫైట్స్ షూటింగ్ జరుగుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











