హాట్ టాపిక్:నిజాయితీ వద్దంటూ రామ్ చరణ్
రామ్ చరణ్ రీసెంట్ గా చాణుక్యుడి ని కోట్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు. అందులో...ఈ ప్రపంచంలో స్టైయిట్ (నిజాయితీ)గా ఉండొద్దు...ఎందుకంటే స్ట్రైయిట్ గా ఉండే చెట్లనే ఎప్పుడూ మొదట కొట్టివేయటానికి ఎంచుకుంటారు. ఈ ట్వీట్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఏ విషయాన్ని ఉద్దేశించి రామ్ చరణ్ ఈ ట్వీట్ చేసాడనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రచ్చ చిత్రం చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా నటిస్తోంది. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంక్రాంతి తర్వాత రచ్చ ఫస్ట్ లుక్, ట్రైలర్, ఫిబ్రవరిలో ఆడియో, మార్చిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.'రచ్చ' సినిమా ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 2.75 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. హరి వెంకటేశ్వర పిక్చర్స్ ఈ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సంస్థ కంప్లీట్ అబ్రాడ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు, డివిడి రైట్స్ కూడా దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఆరెంజ్ సినిమా విడుదలైన చాలా రోజులకు 'రచ్చ' సినిమా విడుదలవుతుండటంతో బిజినెస్ భారీగానే ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











