twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ విషయంలో జగపతి బాబు తర్వాత రమ్యకృష్ణ..?

    By Sindhu
    |

    తన గ్లామర్ తో నిన్నటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ పెళ్ళయిన తర్వాత నటనకు చాలా వరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తను కోరుకునే పాత్రలు రాక, వచ్చే పాత్రలు తనకి నచ్చక …. ఇలా రెండు కారణాల వల్లా గత కొంత కాలంగా ఆమె కెమేరాకు దూరంగా ఉంటోంది.

    అయితే, తాజాగా రమ్యకు ఓ సత్తా వున్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో శివాజీ కథానాయకుడుగా రూపొందుతున్న 'కొలిమి" చిత్రంలో ఆమెకు వయసుకు తగ్గా హుందా పాత్రను ఆఫర్ చేశారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రీసెంట్ గా జగపతి బాబు 'జైబోలో తెలంగాణ" సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొందరు యాక్టర్స్ తెలంగాణ బేస్డ్ సినిమాలలో నటించుటకు దైర్యం చేస్తున్నారు. అదే కోవలలో ఇప్పుడు రమ్యకృష్ణకు కొలిమి చిత్రంలో ఆమె ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా, విద్యార్ధులలో స్ఫూర్తిని రగిలించే పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తనకు నటిగా పేరు తెస్తుందని ఆశలు పెట్టుకుంది. పనిలో పనిగా అటు తెలంగాణ ప్రజల అభిమానాన్ని కూడా పొందచ్చన్నది ఆమె కోరిక!

    నాగేంద్ర దర్శక్వం వహిస్తున్న 'కొలిమి" చిత్రం త్వరలో విడుదలకు సిద్దం కాబోతోంది. జగపతి బాబు జైబోలో తెలంగాణ కూడా నైజాంలో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిందని, దర్శకుడు నాగేంద్ర ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందిని తెలంగాణలో మంచి వసూళ్లును కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరొక విషయమేటంటే నాగార్జున 'రాజన్న" కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రమేఅయినా, ఈ చిత్రం ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు ఎటువంటి సంబందం లేదని అంటున్నారు.

    English summary
    After Jagapathi Babu acting in a film based on Telangana movement, few more actors are daring to be a part of films on Telangana revolution. Actor Shivaji is doing a film titled Kolimi. Now Ramya Krishna too is a part of this star cast. She will play the role of a Telangana professor in this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X