Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
తెలంగాణ విషయంలో జగపతి బాబు తర్వాత రమ్యకృష్ణ..?
తన గ్లామర్ తో నిన్నటి తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ పెళ్ళయిన తర్వాత నటనకు చాలా వరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తను కోరుకునే పాత్రలు రాక, వచ్చే పాత్రలు తనకి నచ్చక …. ఇలా రెండు కారణాల వల్లా గత కొంత కాలంగా ఆమె కెమేరాకు దూరంగా ఉంటోంది.
అయితే, తాజాగా రమ్యకు ఓ సత్తా వున్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో శివాజీ కథానాయకుడుగా రూపొందుతున్న 'కొలిమి" చిత్రంలో ఆమెకు వయసుకు తగ్గా హుందా పాత్రను ఆఫర్ చేశారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రీసెంట్ గా జగపతి బాబు 'జైబోలో తెలంగాణ" సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొందరు యాక్టర్స్ తెలంగాణ బేస్డ్ సినిమాలలో నటించుటకు దైర్యం చేస్తున్నారు. అదే కోవలలో ఇప్పుడు రమ్యకృష్ణకు కొలిమి చిత్రంలో ఆమె ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా, విద్యార్ధులలో స్ఫూర్తిని రగిలించే పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తనకు నటిగా పేరు తెస్తుందని ఆశలు పెట్టుకుంది. పనిలో పనిగా అటు తెలంగాణ ప్రజల అభిమానాన్ని కూడా పొందచ్చన్నది ఆమె కోరిక!
నాగేంద్ర దర్శక్వం వహిస్తున్న 'కొలిమి" చిత్రం త్వరలో విడుదలకు సిద్దం కాబోతోంది. జగపతి బాబు జైబోలో తెలంగాణ కూడా నైజాంలో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిందని, దర్శకుడు నాగేంద్ర ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందిని తెలంగాణలో మంచి వసూళ్లును కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరొక విషయమేటంటే నాగార్జున 'రాజన్న" కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ చిత్రమేఅయినా, ఈ చిత్రం ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు ఎటువంటి సంబందం లేదని అంటున్నారు.