twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీవారి సేవలో భర్త,కుమారుడుతో రమ్యకృష్ణ(ఫొటో)

    By Srikanya
    |

    Ramya Krishna and Krishna Vamsi pray at Tirumala
    తిరుమల: తిరుమల శ్రీవారిని సినీనటి రమ్యకృష్ణ, ఆమె భర్త కృష్ణవంశీ మరియు కుమారుడు రిత్విక్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనసమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రమ్యకృష్ణ దంపతులకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెను చూడటానికి భక్తులు పోటీపడ్డారు.

    కృష్ణవంశీ మాట్లాడుతూ...రమ్యకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ప్రతీ సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామని అన్నారు. ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలే చిత్రం షూటింగ్ జరుగుతోంది. దసరాకి విడుదల అవుతుంది అని తెలిపారు.

    రమ్యకృష్ణ మాట్లాడుతూ... తాను కేవలం బాహుబలి చిత్రం మాత్రమే చేస్తున్నానని అన్నారు. అందులో రాజమాత గా కనిపిస్తానని అన్నారు. తొలిసారిగా కృష్ణవంశీ,తమ కుమారుడుతో కలిసి ఇలా కెమెరాకంటికి దొరికారు.

    English summary
    Ramyakrishna and her husband Krishnavamsi offered prayers to Lord Venkateswara at Tirumala on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X