Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
తమన్నా, రకుల్ని దాటేసిన రమ్యకృష్ణ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పటికి తన సత్తా చాటుతోంది. బాహుబలి తరువాత రమ్యకృష్ణ ఇమేజ్ మరింతగా పెరింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటవిశ్వరూపం ప్రదర్శించింది. రమ్యకృష్ణ కోసం ప్రత్యేకంగా దర్శకులు పాత్రలు రరాస్తున్నారు. తనకు ఉన్న డిమాండ్ కు తగ్గట్లుగానే రమ్యకృష్ణ భారీ స్థాయిలో పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రమ్యకృష్ణ రెమ్యునరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్, తమన్నాని కూడా దాటిపోయింది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదని తాజా ఆమె తీసుకుంటున్నా రెమ్యునరేషన్ లెక్కలే ఇందుకు నిదర్శనం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రమ్యకృష్ణ శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఆమె రోజుకు 6 లక్షల పారితోషకం అందుకుతోందట. ఈ చిత్రానికి రమ్యకృష్ణ మొత్తం 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించింది. ఈ లెక్కన ఈ చిత్రానికి రమ్యకృష్ణ అందుకుంటున్న పారితోషకం రూ 1.50 కోట్లు. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు కోటి వరకు ఛార్జ్ చేస్తుంది. తమన్నా 70 లక్షల వరకు తీసుకుంటుంది. అంటే రమ్యకృష్ణ ప్రస్తుత స్టార్స్ తో పోటీ పడి మరీ పారితోషకం తీసుకుంటోందని అంటున్నారు.