Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇంతటి ఏకాంతం ఎప్పుడూ లేదు..బాగా ఎంజాయ్ చేస్తున్నా.. ‘శివగామి’ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని ఉంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ మానవాళి మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా కరోనా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 80వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా.. ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది.
ప్రజలంతా ఇంటి పట్టునే..
గత యాభై రోజులుగా లాక్ డౌన్ విధించగా ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. స్టార్ సెలెబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొంతమంది సెలెబ్రిటీలు ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంతో తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. తమ ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
లాక్డౌన్లో రమ్యకృష్ణన్ విశేషాలు..
క్షణం కాలం పాటు తీరిక లేకుండా బిజిబిజీగా ఉండే నటీనటులు.. 24 గంటలపాటు ఇంట్లోనే ఉండటం కొత్త అనుభూతిలా ఉంటుంది. ఇదే విషయాన్ని విలక్షణ నటి రమ్యకృష్ణ చెబుతూ.. లాక్ డౌన్ అనుభవాలను పంచుకుంది. ఈ విశేషాలేంటో ఓ సారి చూద్దాం.
బాగా ఎంజాయ్ చేస్తున్నా..
రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘ఓ విధంగా చెప్పాలంటే, ఈ లాక్ డౌన్ అనేది జీవితంలో ఓ కొత్త అనుభవం. ఇంతటి ఖాళీ సమయం, ఏకాంతం గతంలో ఎప్పుడూ దొరకలేదు. చాలా హాయిగా వుంది. గత రెండు నెలలుగా గడపదాటి బయటకు వెళ్లలేదు. జీవితంలో అసలెప్పుడూ ఇలా ఇంటికి అతుక్కుపోలేదు. ఇప్పుడు కావలసినంత సమయం ఉంటోంది.. కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను. జీవితంలో మళ్లీ ఇలాంటి సమయం ఇక రాదేమో..నా వరకు నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
Recommended Video
పలు ప్రాజెక్ట్లతో బిజీ..
అయితే, మరోపక్క బాధ ఏమిటంటే, వలస కార్మికులు, నిరుపేదలు ఈ సమయంలో చాలా కష్టాలు పడుతున్నట్టు వార్తలు వింటున్నాం.. త్వరగా వారి కష్టాలు తీరాలని కోరుకుంటున్నాను' అని చెప్పింది. కాగా, ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ 'రంగమార్తాండ'లోను, పూరి-విజయ్ దేవరకొండ చిత్రంలోనూ, సాయి ధరమ్ తేజ్ చిత్రంలోనూ నటిస్తోంది. తాను చేస్తున్న సినిమాలన్నీ తనకి సంతృప్తిని ఇచ్చేవే అని చెప్పుకొచ్చింది.