Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హాట్ లేడీ...చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సినీనటి రమ్యశ్రీ ఇటీవల రూ. లక్ష విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఏపి రాజధాని నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరూ నడుం బిగించాలని టిడిపి అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ మేరకు సినినటి రమ్యశ్రీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి చెక్కు రూపంలో రూ. లక్ష అందజేసింది.
తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ లేడీగా పేరొందిన రమ్యశ్రీ ఇలా ముందుకు రావడం చర్చనీయాంశం అయింది. రమ్యశ్రీ లాగా పెద్ద పెద్ద స్టార్స్ ముందుకు వచ్చి రాజధాని కోసం విరాళం ఇవ్వాల్సిన అవసరం ఉందని, తద్వారా కొత్తరాజధాని కోసం విరాళాలు ఇచ్చేలా జనాల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
రమ్యశ్రీ గురించి వివరాలు స్లైడ్ షోలో......
రమ్యశ్రీ
రమ్యశ్రీ అసలు పేరు సుజిత. విశాఖపట్నంలో జన్మించింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరును రమ్యశ్రీగా మార్చుకుంది.
సౌత్ సినిమాల్లో..
రమ్యశ్రీ ఇప్పటి వరకు తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ, బోజ్ పురి బాషల్లో ఇప్పటి వరకు దాదాపు 250 సినిమాల్లోనటించింది.
చివరి చిత్రం ‘మల్లి'
రమ్య శ్రీ తెలుగులో నటించిన చివరి చిత్రం ‘మల్లి'. 2013లో ఈ చిత్రం విడుదలైంది.
స్వీయ దర్శకత్వం
రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో ‘ఓ మల్లి' చిత్రం తెరకెక్కింది. ఇందులో ఆమె అందాల ప్రదర్శన మాత్రమే కాదు...ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సబ్జెక్టు కూడా ఉంది. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.