Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రానా 'చేతబడి'.. భయపెట్టిన దర్శకుడితో కొత్త ప్రయోగం
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో రానా ఒకరు. ఈ దగ్గుబాటి హీరోకు కథ నచ్చితే చాలు దర్శకులకు తనదైన శైలిలో సపోర్ట్ చేస్తూ సినిమాను ఎలాగైనా సక్సెస్ బాటలో నడిపించేలా చేస్తాడు. ఇక రానా మొదటిసారి ఒక హారర్ స్టోరీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. జనవరిలో షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట.
మణిరత్నం శిష్యుడు మిలింద్ రావ్ 2017లో గృహం సినిమాతో ఎంతగా భయపెట్టాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సిద్దార్థ్ హీరోగా నటించిన ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. కలెక్షన్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అసలు విషయంలోకి వస్తే మిలింద్ నెక్స్ట్ సినిమాపై గత కొన్ని నెలలుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఫైనల్ గా రానా దగ్గుబాటి మిలింద్ చెప్పిన భయానక థ్రిల్లర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కథ చేతబడి, క్షుద్రపూజలు వంటి పాయింట్ చుట్టూ తిరుగుతుందట.
బ్లాక్ మ్యాజిక్ అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుందని హిందీ తమిళ్ లో కూడా గ్రాండ్ గా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఇక తెలుగులో సినిమాకు ధీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ రానా అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ధీరుడు సినిమా షూటింగ్ ని జనవరి నుంచి స్టార్ట్ చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇక సమ్మర్ అనంతరం సినిమాను విడుదల చేయాలని రానా దగ్గుబాటి ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.