Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దగ్గుపాటి రానా కి తగిలిన దెబ్బ చిన్నదే
ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్తో ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించబోతున్న భారీ బడ్జెట్ సినిమా 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ జూలై 6న ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ "దాదాపు ఏడాది పాటు చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తర్వాత జూలై 6న 'బాహుబలి' షూటింగ్ మొదలు పెట్టబోతున్నందుకు ఎంతో ఉద్వేగంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో చిత్రాన్ని నిర్మిస్తున్నాం. చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి అన్ని విధాలా సమాయత్తమయ్యారు'' అని తెలిపారు
. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ హీరోగా నటించబోతున్నారు. అనుష్క, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకు వచ్చే నెల 6న కొబ్బరికాయ కొట్టి చిత్రీకరణకు శ్రీకారం చుడతారు.
గతేడాది సరిగ్గా అదే రోజున 'ఈగ' సినిమా తెరపైకి వచ్చింది. 'బాహుబలి'ని ఐమాక్స్ కెమెరాతో చిత్రించబోతున్నారనే విషయాన్ని దర్శకుడు ఖండించారు. ఈ సినిమాను ఆరీ అలెక్సా ఎక్స్టీ అనే కెమెరాతో తెరకెక్కిస్తామని తెలిపారు. అలాగే చిత్రీకరణకు అయ్యే వ్యయం గురించి వస్తున్న వార్తల్నీ తోసిపుచ్చారు. తెలుగు, తమిళ భాషల్లో 'బాహుబలి' రూపొందుతుంది. చిత్రాన్ని హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తారు.