Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హాలీవుడ్ చిత్రం కమిటైన తెలుగు స్టార్ హీరో
తెలుగు పరిశ్రమనే ఈదలేకుంటే ఇక హాలీవుడ్, బాలీవుడ్ సంగతి ఏమిటంటారా...అయితే ట్రైల్ వెయ్యటంలో తప్పేముంది అనుకున్నాడో ఏమో గాని దగ్గుపాటి రానా తాజాగా ఓ హాలీవుడ్ చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ మేరకు ట్రైల్ షూట్ కూడా జరిగింది. ఆదిత్య బట్టాచార్య అనే డైరక్ట్రర్ దీనిని డైరక్ట్ చేయనున్నాడు. ఆదిత్య బట్టాచార్య గతంలో అమీర్ ఖాన్ తో రాఖ్ అనే చిత్రం రూపొందించారు.
బసు బట్టాచార్య కుమారుడైన ఆదిత్య ఆ తర్వాత కొన్ని యుఎస్ ప్రాజెక్టులలో బిజీ అయ్యారు. ఆ తర్వాత సెన్సో యునీకో అనే ఇటాలియన్ చిత్రం రూపొందించారు. ఇక దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రానా ని చూసి ఎంపిక చేసుకన్నాడని, ట్రైల్ షూట్ కూడ రహస్యంగా హైదరాబాద్ లోనే జరిగిందని చెప్తున్నారు. ఇక రానా, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రెడీ అయిన నేనూ ..నా రాక్షసి చిత్రం త్వరలో రిలీజు కానుంది.