రానా ఆ సినిమా చెయ్యడం లేదు, అదంతా ఫేక్ న్యూస్!
నేనే రాజు నేనే మంత్రి మంచి సక్సెస్ సాధించిన తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఆ కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. తేజ డైరెక్షన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన విషయం తెలిసిందే.
1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. కాని ఆ న్యూస్లో నిజం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉన్న తేజ.. రానాతో సినిమా గురించి ప్రస్తావన రాలేదని సమాచారం. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో భవిషత్తులో.. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా లేదని స్పష్టంగా తెలుస్తోంది.

తేజ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు సంబంధించి వర్క్ లో బిజీగా ఉన్నాడు. మే మొదటివారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. భారీ తారాగణం ఈ సినిమాలో పాల్గోనబోతోందని సమాచారం. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు రానున్నాయి.


Click it and Unblock the Notifications











