Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ట్రెండింగ్: బాలయ్య వివాదంపై వరుణ్ తేజ్.. ఆరెంజ్ నష్టాలకు అతడే కారణం.. ఆమెకు డబ్బు పిచ్చి!
త్రిషతో నాకు వర్కౌట్ కాలేదు.. మేం విడిపోయింది అందుకే అంటున్న రానా.. ఇష్టం లేకున్నా వాళ్ళని పొగడాల్సి వచ్చింది అంటున్న రాజమౌళి.. పేదింటి అమ్మాయి ప్రేమలో ప్రభాస్.. నందమూరి ఫ్యామిలిలో జూ ఎన్టీఆర్.. మా కుటుంబానికి నేను అంటున్న సుమంత్.. ఆమెకు బాగా డబ్బు పిచ్చి.. తేజ సినిమా గురించి ఊహాగానాలు.. బాలయ్య వివాదంపై వరుణ్ తేజ్ వివరణ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో రెచ్చగొడుతున్న వర్మ.. ఇలాంటి ఆసక్తికర వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వివరాలు మీ కోసం..
త్రిషతో నాకు వర్కౌట్ కాలేదు.. అందుకే విడిపోయాం.. బయటపెట్టేసిన రానా!
సినీతారల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన చాలా రూమర్స్ ప్రచారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడూ ఆ రూమర్స్ లో కొన్ని నిజమవుతుంటాయి కూడా. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ఏదైనా ప్రేమ వార్త బయటకు వస్తే హాట్ టాపిక్ గా మారుతుంది. ఆరడుగుల ఆజానుబాహుడు రానా విషయంలో కూడా అలాంటి రూమరే ప్రచారం జరిగింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో రానా తన ప్రేమ వ్యవహారాల గురించి బయటపెట్టాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఇష్టం లేకున్నా ఆ సినిమాలని ప్రశంసించా.. ఆ ఇద్దరిలో ఆయనంటేనే ఇష్టం.. రాజమౌళి!
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే సంచలనం. రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ సినిమా అభిమానులని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో రాజమౌళి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. కాఫీ విత్ కరణ్ షోలో రాజమౌళి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
పేదింటి అమ్మాయితో ప్రేమలో ప్రభాస్.. అసలు కథ ఇదే!
యంగ్ రెబల్ ప్రభాస్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తూనే దర్శకుడు రాధాకృష్ణతో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు 2019లోనే విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018లో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా నిరాశపరిచిన ప్రభాస్ వచ్చే ఏడాది మాత్రం డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ప్రభాస్ ని అభిమానులు యాక్షన్ హీరోలా చూడాలని భావిస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే సాహో రూపొందితోంది. కానీ కొంత చేంజ్ కోసం రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ కథగా రాబోతోంది. ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నందమూరి ఫ్యామిలిలో జూ. ఎన్టీఆర్.. మా కుటుంబంలో నేను.. హీరో సుమంత్!
హీరో సుమంత్ కేవలం మూడు వారాల వ్యవధిలోనే మరో చిత్రంతో రాబోతున్నాడు. సుమంత్ నటించిన సూపెన్స్ థ్రిల్లర్ చిత్రం సుబ్రహ్మణ్యపురం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ నటిస్తున్న మరో చిత్రం ఇదంజగత్. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదంజగత్ చిత్రంలో సుమంత్ న్యూస్ రిపోర్టర్ గా నటిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. సినిమా విడుదల సందర్భంగా సుమంత్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆమెకు డబ్బు పిచ్చి, దర్శకుడు తేజ అధిక ప్రాధాన్యత.. హీరోయిన్పై వస్తున్న రూమర్స్!
అందాల చందమామ కాజల్ అగర్వాల్ దశాబ్దానికి పైగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కోనసాగుతోంది. కాజల్ దాదాపుగా సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. చిరంజీవి నుంచి మొదలు పెడితే పవన్, మహేష్, ఎన్టీఆర్, విజయ్, చరణ్, ప్రభాస్, బన్నీ ఇలా స్టార్ హీరోలందరిని చుట్టేసింది. మునుపటిలా ప్రస్తుతం కెరీర్ లో జోరు లేకున్నా మంచి అవకాశాలనే అందుకుంటోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వరకు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ గా నటించి మెప్పించిన కాజల్ ప్రస్తుతం తాను నటించే చిత్రాల విషయంలో వైవిధ్యాన్ని కోరుకుంటోందట. తేజ దర్శత్వంలో బెల్లం కొండ శ్రీనివాస్ సరసన మరోమారు కాజల్ నటిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అందుకే నాన్నకు కోపం వచ్చింది: నాగబాబు-బాలయ్య వివాదంపై వరుణ్ తేజ్!
బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ ఈ మధ్య కాలంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్యను పట్టుకుని నాగబాబు అంత మాట అనేశారేంటి? ఇలా అని ఉండకూడదు అని కొందరు అంటుండగా... బాలయ్య ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలకు ఇది తగిన సమాధానం అని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా 'అంతరిక్షం' మూవీ ప్రమోషన్లలో ఉన్న వరుణ్ తేజ్కు ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తన సినిమాలు, తన వర్క్ ఏంటో తప్ప ఇలాంటి వివాదాలను పట్టించుకోని వరుణ్ తేజ్ దీనిపై ఏమన్నారో చూద్దాం....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చిరంజీవి, బాలయ్య మధ్య ఇంకా అవే ఈక్వెషన్స్... అందుకే రాలేదు!
బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. తన తండ్రి జీవితంపై తీస్తున్న సినిమా కావడంతో నిర్మాణ బాధ్యతలు కూడా తన భుజాలమీదే వేసుకున్నారు బాలయ్య. ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలుగా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్లో జరిగిన బయోపిక్ ఆడియో రిలీజ్ వేడుక సినీ ప్రముఖుల రాకతో కన్నులపండుగలా సాగింది. ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. అయితే చాలా మంది కళ్లు ఈ ఈవెంటులో మెగాస్టార్ చిరంజీవి కోసం వెతికాయి. కానీ ఆయన కనిపించలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
బాలయ్య కోపం ప్రత్యేకంగా చెప్పాలా? అవమానిస్తున్నావ్... రానాకు స్వీట్ వార్నింగ్
రానా అందరితో చాలా సరదాగా, కూల్ యాటిట్యూడ్తో ఉంటారు... బాలయ్యతో ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటున్నారా? ఇదంతా రానా హోస్ట్ చేస్తున్న 'నెం.1 యారి విత్ రానా' రియాల్టీ షోలో చోటు చేసుకున్న సంఘటన. అయితే సీరియస్ ఇష్యూ అయితే కాదు, జస్ట్ సరదాగా సాగిన కార్యక్రమం. బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతికి విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా వీరి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం అవుతుంది. తాజాగా ప్రోమో వదిలారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎన్టీఆర్ బయోపిక్లో కనిపించే 55 మంది ప్రముఖులు వీరే... ఎవరెవరు ఏ పాత్రలో?
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'.. 'యన్.టి.ఆర్ మహానాయకుడు' అనే రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం జనవరి 9న, రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా మాత్రమే కాదు... ఇండస్ట్రీకి చెందిన ఎక్కువ మంది పాత్రలు ఈ చిత్రంలో కనిపించబోతుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో ఎవరెవరు ఏ పాత్రలో కనిపించబోన్నారు అనే పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
‘వెన్నుపోటు' వివాదం: థాంక్స్ చెబుతూ మళ్లీ రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ
వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'లక్ష్మిస్ఎన్టీఆర్' సినిమాలో వెన్నుపోటు సాంగ్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఎన్టీ రామారావు జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన్ను నమ్మించి వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనేది చూపించబోతున్నారు. అయితే ఈ వెన్నుపోటు సాంగులో ఎన్టీ రామారావు అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోస్ ఎక్కువగా ఫోకస్ చేయడంతో తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబును కించపరిచే విధంగా ఈ సాంగ్ ఉందంటూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలపై వర్మ రియాక్ట్ అయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సహజీవనం అంటే సెక్స్.. ‘ఇష్టంగా' ఇంకేదో ఊహించుకుంటారు.. రికార్డు ముద్దు సీన్
ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వీ రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఇది. స్టార్ కమెడియన్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆరెంజ్ నష్టాలకు అతడే కారణం.. పవన్, అన్నయ్య లేకపోతే.. ఆ నిర్ణయం.. నాగబాబు
టాలీవుడ్లో మెగా బ్రదర్ నాగబాబు మంచి నటుడే కాదు, విలువలతో కూడిన వ్యక్తి. ఒకప్పుడు ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ఆయన నైజం. అదే ఆరెంజ్ సినిమా నిర్మాణం దెబ్బ తీసింది. గతంలో రాంచరణ్ హీరోగా ఆరెంజ్ అనే చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో నాగబాబు ఆర్థికంగా దారుణంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆరెంజ్ తర్వాత పరిస్థితులను వెల్లడించిన విషయాలు మీ కోసం..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
100 కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. బంగారు గనుల కథతో కనకవర్షం.. డ్రైవర్ కొడుకు రికార్డులు బ్రేక్!
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ చిత్రం వసూళ్ల విజయఢంకా మోగిస్తున్నది.భారీ మాఫియా బ్యాక్డ్రాప్, కోలార్ బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా మైమరిపిస్తోంది. విడుదలైన ప్రతీచోట, పలు ప్రాంతాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కేటీఆర్ బెంచ్మెట్.. వినయ విధేయుడు కాదు.. లైఫ్లో రెండే సాధించాను.. అవేమిటంటే.. చిరంజీవి
రంగస్థలం సెన్సేషనల్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీను. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 28న రిలీజ్ కానున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు చలపతి రావు, సీనియర్ హీరోయిన్ స్నేహ, క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, ప్రవీణ, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
త్రివిక్రమ్తో రాంచరణ్ సెట్ చేశాడు.. అలా నన్ను ఇరికించాడు.. చిరంజీవి సైరా తర్వాత..
ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమా గురించే అనేక రకాలైన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నాడనే వార్త ఇటీవల హల్ చల్ చేసింది. కానీ అలాంటి వార్తలకు తెరదించుతూ తాను చేయబోయే సినిమా గురించి వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాంబు పేల్చాడు. మెగాస్టార్ చిరంజీవి ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే..