Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అతిథుల పళ్లెంలో అమృతం... దగ్గుబాటి వారింట వంటలు అదుర్స్...
భళ్లాలదేవుడు ఎట్టకేలకు తన దేవసేనను దక్కించుకున్నాడు. ఇక రామానాయుడు స్టూడియోనే మహిష్మతి రాజ్యమంత అందంగా ముస్తాబైంది. ఈరోజే రానా, మిహీకాల మూడు ముళ్ల ముచ్చట కావడంతో సర్వాంగ సుందరంగా సిద్ధమైన రామానాయుడు స్టూడియో మధ్యాహ్నమయ్యేసరికి ఘుమఘుమలాడిపోతోందట.
కరోనా పుణ్యమాని కేవలం 30 మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి తంతు కానిచ్చేస్తున్నా, ఎక్కడా ఆ హంగూ ఆర్భాటాలకు మాత్రం లోటు రానివ్వడంలేదు దగ్గుబాటి కుటుంబం. వివాహ వేడుకల్లో ఇరు కుటుంబాల సంప్రదయాలూ ప్రతిబింబించేలా చూసుకునేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఓ బృందం విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక భోజన ఏర్పట్లు హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్ కు అప్పగించినట్లు సమాచారం.
తెలుగు, మార్వాడిల సంప్రదయాలను ప్రతిబింబించే విధంగా అన్ని ఏర్పాట్లు జరగ్గా, భోజనం విషయంలో రాజస్థానీ వంటకాలతో పాటూ, తెలుగు వంటకాలకూ ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా మార్వాడీ వంటకాల్లో ముఖ్యమైన కచోరీ, పకోడీ, దాల్ బాటీ చూర్మా, లాల్ మాస్, గట్టే కీ సబ్జీ వంటివి ప్రత్యేకంగా తయారు చేయించారు.
తెలుగు వంటకాల్లోనూ ప్రత్యేక శ్రద్ధే కనబరిచారని తెలుస్తోంది. అయితే, రానాకు ఢిల్లీ వంటకాలంటే ప్రత్యేకమై ఆసక్తి ఉండటంతో వాటికీ అతిథుల మెనూలో ప్రత్యేక స్థానం కల్పించనున్నారని తెలుస్తోంది.