Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కలకాలం చెప్పుకుంటాను, కళ్ళనీళ్ళతో రానా ఏమోషనల్ స్పీచ్
''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఏమోషనల్ అయ్యాడు రానా.
బాహుబలి సినిమాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాడు జక్కన్న రాజమౌళి. ఆ సినిమాలో కీలకమైన 'మాహిష్మతి' సామ్రాజ్య నిర్మాణం చేసింది ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. రెండో విభాగానికి కూడా ఆయనే పని చేసాడు. ఈ సినిమా కోసం ఆయన ప్రతిష్టాత్మకమైన శంకర్ 'రోబో-2'ను కూడా వదులుకున్నారు.
మాహిష్మతీ రాజ్యం
దాదాపు అయిదు సంవత్సరాల పాటు సాగిన సుధీర్ఘమైన బాహుబలి జర్నీ లో ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మాహిష్మతీ రాజ్యం తో ఒక అనుబందం ఏర్పడి పోయింది. అయితే కాలం ఎల్లప్పుడూ అలాగే ఉందదు కదా... ఇప్పుడు బాహుబలి పూర్తయిపోయింది, మాహిష్మతీ రాజ్యాన్ని తొలగించేసే సమయం కూడా వచ్చేసింది.
మాహిష్మతీ నగరం ఇక కనిపించదు
కళ్ళముందు ఒక మహా సామ్రాజ్యంగా నిలిచిన మాహిష్మతీ నగరం ఇక కనిపించదు., ఆ సెట్టింగులని తీసివేస్తారు..... ఆ భాద ఎలా ఉంటుందో బాహుబలి టీం లో పని చేసిన వారికే తెలుస్తుంది. ఆ భాదని రానా బయటికి చెప్పేసాడు. ఇన్ని సంవత్సరాలుగా నిజం కాక పోయినా తమ దేశం గా భావించిన మాహిష్మతీ సామ్రాజ్యం ఇక సినిమాలోనే చూసుకోవాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ భాదిస్తుందన్న విశయాన్ని అందరూ ఫీల్ అవుతున్నా అందరి తరఫునా తానే చెప్పేసాడు....
ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం
బాహుబలి ప్రిరిలీజ్ ఫంక్షన్ లో మాహిష్మతి గురించి చెబుతూ ఉద్విగ్నానికి లోనయ్యాడు రానా. "కాలం కరిగిపోయే క్షణాల సమూహం అయితే.. బాహుబలి సినిమా ఎప్పటికీ నిలిచిపోయే శిల్పం అని ఆనాడే చెప్పాను. బాహుబలి విషయంలో ఈ మాటను నిజం చేసినందుకు థ్యాంక్స్. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ వింటే.. నాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే నాకు బాధ కూడా ఉంది'' అంటూ తన మనసులో ఉన్న బాధని చెప్పుకున్నాడు రానా.
ప్రభాసే నా బెస్ట్ కో స్టార్
''మాహిష్మతి అనే సామ్రాజ్యంలో నేను గడిపిన క్షణాల గురించి కలకాలం చెప్పుకుంటాను. నేను జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రభాసే నా బెస్ట్ కో-స్టార్. అయితే ఇప్పుడు నా బాధ గురించి చెబుతాను. ఆల్రెడీ కళ్ళెమ్మటి నీళ్ళు కూడా వచ్చేశాయి. మళ్ళీ నేను మాహిష్మతికి వెళ్ళలేననే ఆ ఫీలింగ్ నన్ను బాధిస్తోంది'' అంటూ ఏమోషనల్ అయ్యాడు.
మీ తిట్లే నాకు ఇష్టం.
ఇక ఈ సినిమాలో పనిచేసినప్పుడు రెండు మూడు రోజులకు ఒకసారి కీరవాణి సతీమణి వల్లీ గారు తనని తిట్టేవారని.. ఆమె ఇలా తిడుతుంటే తనకు రియల్ లైఫ్ లో శివగామి లా కనిపించేవారని చెప్తూ... "వల్లిగారూ ప్లీజ్..! నన్ను ఫోన్ చేసి 3 4 వారాలకు ఒకసారి తిట్టండి . మీ తిట్లే నాకు ఇష్టం.
సాహోరే బాహుబలి
మీతో తిట్టించుకోవడానికి నేను ఎన్ని అవకాశాలు అయినా ఇస్తాను. అంటూ మాట్లాడిన రానా చివరగా.... "సాహోరే బాహుబలి..!'' అంటూ ప్రసంగం ముగించాడు... మాహిషమతీ గురించి రాన మాట్లాడినంత సేపూ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పని చేసిన వాళ్ళలోనూ, రోజూ ఆ సెట్స్ మధ్య తిరిగిన సినిమా టీమ్ వాళ్ళలోనూ ఆ భాధ కనిపించింది.