చారిటీ కోసం అనుష్క- రణబీర్ దుస్తులు వేలం
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అనుష్క శర్మలు బట్టలు వేలం వేయబోతున్నారు. 'రాక్ స్టార్' చిత్రంలో రణభీర్ ధరించిన కాశ్మీరీ ఫెరాన్, 'జబ్ తక్ హే జాన్'లో అనుష్క వేసుకున్న లెదర్ జాకెట్ ను ఆన్ లైన్ సంస్థ ఈబే ద్వారా వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఓ మంచి పని కోసం ఉపయోగించనున్నారు.
జమ్ము కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారికి, అక్కడి అభివృద్ధికి తమవంతు నిధులను సేకరణలో భాగంగా వేలం కార్యక్రమం జరుగుతోంది. డిసెంబర్ 4న వేలం ప్రారంభమైన ఈ వేలం ఈ నెల 13 వరకు జరుగుతుంది. అత్యధిక మొత్తం చెల్లించిన అభిమానులు ఈ వస్త్రాలు దక్కించుకుంటారు.

ఒక మంచి పని కోసం జరుగుతున్న కార్యక్రమంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని, ఈ వేలం కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నాను' అన్నారు రణబీర్ కపూర్. అనుష్క శర్మ స్పందిస్తూ ‘కాశ్మీర్, అస్సాంలలో వరదల కారణంగా చాలా నష్టం జరిగింది. వారికి సహాయం అందించాల్సిన అవసరం మనపై ఉంది' అన్నారు


Click it and Unblock the Notifications











