Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చారిటీ కోసం అనుష్క- రణబీర్ దుస్తులు వేలం
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అనుష్క శర్మలు బట్టలు వేలం వేయబోతున్నారు. 'రాక్ స్టార్' చిత్రంలో రణభీర్ ధరించిన కాశ్మీరీ ఫెరాన్, 'జబ్ తక్ హే జాన్'లో అనుష్క వేసుకున్న లెదర్ జాకెట్ ను ఆన్ లైన్ సంస్థ ఈబే ద్వారా వేలానికి పెట్టారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఓ మంచి పని కోసం ఉపయోగించనున్నారు.
జమ్ము కాశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వారికి, అక్కడి అభివృద్ధికి తమవంతు నిధులను సేకరణలో భాగంగా వేలం కార్యక్రమం జరుగుతోంది. డిసెంబర్ 4న వేలం ప్రారంభమైన ఈ వేలం ఈ నెల 13 వరకు జరుగుతుంది. అత్యధిక మొత్తం చెల్లించిన అభిమానులు ఈ వస్త్రాలు దక్కించుకుంటారు.
ఒక మంచి పని కోసం జరుగుతున్న కార్యక్రమంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని, ఈ వేలం కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను కోరుతున్నాను' అన్నారు రణబీర్ కపూర్. అనుష్క శర్మ స్పందిస్తూ ‘కాశ్మీర్, అస్సాంలలో వరదల కారణంగా చాలా నష్టం జరిగింది. వారికి సహాయం అందించాల్సిన అవసరం మనపై ఉంది' అన్నారు