Don't Miss!
- News YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్- వివేకా కేసులో వ్యాఖ్యలకు నోటీసులు..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందరూ చూస్తుండగా దర్శకుడి పెదాలను ముద్దాడిన హీరో!
జగ్గా జాసూస్ సాంగ్ లాంచ్ సందర్భంగా దర్శకుడిని రణబీర్ ముద్దాడాడు. ఐదేళ్ల క్రితం కూడా రణబీర్ కపూర్ ఇలాంటి పనే చేశాడు.
ముంబై: సినిమా ప్రమోషన్ల కోసం ఎంతకైనా తెగించే బాలీవుడ్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ జంటగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జగ్గా జాసూస్' ప్రెస్ మీట్లో జరిగిన సంఘటన చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా మీడియాతో చిత్ర యూనిట్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హీరో రణబీర్ కపూర్.... ఉన్నట్టుండి దర్శకుడిపై ముద్దుల వర్షం కురిపించాడు. తన పెదాలతో అతడి పెదాలను ముద్దాడాడు.
షాకైన మీడియా
హీరో హీరోయిన్ ముద్దులాడుకుంటే పెద్ద న్యూస్ అయ్యేదో లేదో? తెలియదు కానీ..... ఇలా హీరో, దర్శకుడు మీడియా ముఖంగా ముద్దులాడుకోవడం హాట్ టాపిక్ అయింది.
ఐదేళ్ల క్రితం కూడా ఇలానే...
ఐదేళ్ల క్రితం కూడా రణబీర్ కపూర్ ఇలాంటి పనే చేశాడు. అప్పట్లో బర్ఫీ చిత్ర ప్రమోషన్లో ఇదే విధంగా అనురాగ్ బసును ముద్దాడిన సంగతి తెలిసిందే.
పబ్లిసిటీ స్టంట్
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు బాలీవుడ్ నిపుణులు. ఏదో ఒక సంచలనం క్రియేట్ చేసి సినిమాను ప్రమోట్ చేసుకోవాలనే తపనలోనే ఇలాంటివి చేస్తుంటారని అంటున్నారు.
జగ్గా జాసూస్
సినిమా వివరాల్లోకి వెళితే ఇదో మ్యూజికల్ అడ్వంచర్ రొమాంటిక్ ఫిల్మ్. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అనురాగ్ బసు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యారు. యూటీవీ మోషన్ పిక్చర్స్ అధినేత సిద్ధార్థరాయ్ కపూర్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒక యంగ్ డిటెక్టివ్ మిస్సయిన తన తండ్రి వెతుక్కుంటూ వెళ్లి ఎలాంటి సాహసాలు చేసాడు అనే కాన్సెప్టుతో ఈ సినిమా సాగుతుంది.
రిలీజ్ డేట్
కత్రినా కైఫ్, రణ్బీర్ కపూర్ జంటగా నటించిన ‘జగ్గా జాసూస్' జులై 14న విడుదల కాబోతోంది.