twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రణబీర్‌ తాజా చిత్రం 'అంజానా అంజానీ' కథ ఇదే

    By Srikanya
    |

    రణబీర్‌ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన హిందీ చిత్రం 'అంజానా అంజానీ'. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం కథ ఈ విధంగా సాగుతుంది. ఆకాష్(రణబీర్‌ కపూర్) చనిపోవాలనుకున్నాడు. కానీ అతనికి...వేడి వేడి కాఫీని స్ట్రాతో తాగాలని, ఒక సినిమాకి డెరైక్షన్ చేయాలని, ఏదైనా ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరి ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలని..ఇలా మూడు కోరికలు ఉంటాయి. ఇక, కియారా(ప్రియాంక చోప్రా) కూడా ఈ అట్లాంటి అమ్మాయే. జీవితంపట్ల విసిగి, వేసారిన తను కూడా ఆత్మహత్య చేసుకోవాలను కుంటుంది. అయితే ఈలోగా కియారాకి కొన్ని కోరికలు ఉంటాయి. ఒకే రకమైన ఆలోచనలతో వున్న ఈ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ఓ బ్రిడ్జ్ దగ్గరకు వస్తారు వేరు వేరుగా. అక్కడ వీరికి పరిచయం ఏర్పడుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వారు చెప్పుకుంటారు. తమకున్న కోరికలను 20 రోజుల్లో తీర్చేసుకుని చనిపోవాలనుకుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీళ్ళ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ఇక ఈ చిత్ర కథ చూస్తుంటే...పూరీ జగన్నాధ్ చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం గుర్తుకు రావటం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షాజిద్ నదియడ్‌వాలా నిర్మాత. విశాల్-శేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X