Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రణబీర్ తాజా చిత్రం 'అంజానా అంజానీ' కథ ఇదే
రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన హిందీ చిత్రం 'అంజానా అంజానీ'. ఈ సినిమా అక్టోబరు 1న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం కథ ఈ విధంగా సాగుతుంది. ఆకాష్(రణబీర్ కపూర్) చనిపోవాలనుకున్నాడు. కానీ అతనికి...వేడి వేడి కాఫీని స్ట్రాతో తాగాలని, ఒక సినిమాకి డెరైక్షన్ చేయాలని, ఏదైనా ఫుట్బాల్ క్లబ్లో చేరి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని..ఇలా మూడు కోరికలు ఉంటాయి. ఇక, కియారా(ప్రియాంక చోప్రా) కూడా ఈ అట్లాంటి అమ్మాయే. జీవితంపట్ల విసిగి, వేసారిన తను కూడా ఆత్మహత్య చేసుకోవాలను కుంటుంది. అయితే ఈలోగా కియారాకి కొన్ని కోరికలు ఉంటాయి. ఒకే రకమైన ఆలోచనలతో వున్న ఈ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి ఓ బ్రిడ్జ్ దగ్గరకు వస్తారు వేరు వేరుగా. అక్కడ వీరికి పరిచయం ఏర్పడుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వారు చెప్పుకుంటారు. తమకున్న కోరికలను 20 రోజుల్లో తీర్చేసుకుని చనిపోవాలనుకుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీళ్ళ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ. ఇక ఈ చిత్ర కథ చూస్తుంటే...పూరీ జగన్నాధ్ చిత్రం ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం గుర్తుకు రావటం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షాజిద్ నదియడ్వాలా నిర్మాత. విశాల్-శేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.