Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముదురు భామతో ముద్దు సీన్, నాలుగు టేకులు!
ముంబై : బాలీవుడ్ యంగ్ అండ్ హాండ్సమ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తన తాజా సినిమా 'యే జవానీ హై యే దివానీ' చిత్రంలో నిన్నటితరం హాట్ హీరోయిన్ మాధురి దీక్షిత్తో ఐటం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగులో మాధురి దీక్షిత్ బుగ్గపై ముద్దు పెట్టుకునే సన్నివేశం సైతం ఉంది.
అయితే ఈ ముదురు సెక్సీ భామను ముద్దు పెట్టుకునే సీన్ చేసేటపుడు రణబీర్ తడబడ్డాడట. నాలుగు టేకుల తర్వాత కానీ ఆ సీన్ను పర్ఫెక్ట్గా చేయలేకపోయాడట. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రణబీర్ కావాలనే ఇలా చేసాడని, ఆమెను మళ్లీ మళ్లీ ముద్దు పెట్టుకునే అవకాశం కోసమే ఇలా నాలుగు టేకులు తీసుకున్నాడని టాక్.
ఇలాంటి టాక్ రావడానకి రణబీర్ ఇంతకు ముందుకు చేసిన ఓ కామెంటే కారణం. ఈ నెల 31న 'యే జవానీ హై యే దివానీ' చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు రణబీర్. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ 'ఆమె(మాధురి) నా మొదటి ప్రేమికురాలు, ఆమె పెళ్లి చేసుకోవడంతో నా గుండె పగిలిపోయింది. ఇప్పుడు ఆమెతో కలిసి పని చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో ఆమెను ముద్దు పెట్టుకునే చాన్స్ కోసం దర్శకుడికి నా స్టైల్లో లంచం ఇచ్చాను అని చెప్పుకొచ్చాడు. అదన్నమాట సంగతి.
ఈ చిత్రంలో 'ఘాగ్రా' అనే ఐటం సాంగులో మాధురి స్టెప్పులేసింది. ఈ పాటకు ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ కొయోగ్రాఫర్. ఆమె ఎంతో సిన్సియర్, అదే విధంగా పాషనేట్ మరియు టాలెంటెడ్. ఆమెతో కలిసి పని చేయడం ఎంతో గొప్ప అనుభూతి, ఆమె వండర్ ఫుల్ లేడీ... అంటూ తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయట పెట్టాడు రణబీర్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..ఎన్నో సినిమాల్లో రణబీర్ తండ్రి రిషి కపూర్ తో కలిసి నటించిన మాధురి దీక్షిత్ ఇప్పుడు రణబీర్ తో స్టెప్పులేయడం. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.