Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వారిద్దరు పబ్లిగ్గా పట్టుబడ్డారు, కెమెరాలకు చిక్కారు
ముంబై: తమ మధ్య ఉన్న సంబంధాన్ని బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇక మాత్రం గోప్యంగా ఉంచదలుచుకోలేదని అర్థమవుతోంది. తమ మధ్య గల సంబంధంపై ఊహాగానాలకు తెర దింపే పనికి పూనుకున్నట్లున్నారు.
ఐబిఎన్ కథనం ప్రకారం - ది వోల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కత్రినా, రణబీర్ కలిసి వెళ్లారు. ఆ సినిమా చూస్తూ అందరి కంటా పడ్డారు. ముంబైలో ఇది జరిగిది. కలిసి కెమెరా కన్నుకు చిక్కడానికి ఇష్టపడని ఆ జంట ఈసారి మాత్రం దర్జాగా ఫోజులు ఇచ్చేశారు.
ఇద్దరు కలిసి కెమెరాకు ఇదే మొదటిసారి. ఒకే ఫ్రేమ్లోకి ఆ జంట కలిసి రావడం ఇదే తొలిసారి అన్న మాట. దాంతో తమ మధ్య ఉన్న సంబంధాన్ని వారు అందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే కలిసి కెమెరాకు చిక్కారా అనేది చర్చనీయాంశంగా మారింది.
రణబీర్ కజిన్ సిస్టర్ కరీనా కపూర్ ఓ టాక్ షోలో వారిద్దరి సంబంధం గురించి కాస్తా మసాలా దట్టించి, చెప్పి చెప్పకుండా చెప్పేశారు. ఇదంతా చూస్తుంటే రణబీర్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహం పుట్టుకొస్తోంది.