Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రంగస్థలం: ‘రంగమ్మా..మంగమ్మా’ సాంగ్ అదిరిందంతే....
రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 'రంగమ్మా..మంగమ్మ' పేరుతో సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో, సమంత రామలక్ష్మి పాత్రలో కనిపించబోతోంది. ఇద్దరి మధ్య జరిగే సరసాల నేపథ్యంలో ఈ పాట సాగుతుందని తెలుస్తోంది. చంద్రబోస్ అందించిన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చాడు. ఎంఎం మానసి తన అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు మరింత వన్నెతెచ్చారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రంగస్థలం' చిత్రం మార్చి 30 విడుదలకు సిద్ధమవుతోంది. పల్లెటూరి నేపథ్యంలో రోటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండబోతోంది. ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.