Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రంగస్థలం కలెక్షన్స్: మహేష్ రాక ముందే పని పూర్తిచేసేసిన రాంచరణ్.. ఆ స్థానం రంగస్థలందే!
Recommended Video
బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.
రాంచరణ్ నటనతో, సుకుమార్ కథతో
రంగస్థలం చిత్రానికి ముందు వరకు రాంచరణ్ మాస్ అంశాలున్న కథలు చేశాడు. రంగస్థలం చిత్రంలో పల్లెటూరి యువకుడిగా వినికిడి లోపంతో పెద్ద సాహసమే చేశాడు. రాంచరణ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. కానీ ఆ సాహసాన్ని చరణ్ చిట్టిబాబు పాత్రలో మెప్పించి దిగ్విజయంగా పూర్తి చేసాడు. సుకుమార్ అద్భుత కథతో మ్యాజిక్ చేసాడు.
కలెక్షన్ల సునామి
రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. బాహుబలి1, 2 తరువాత ఆ స్థానంలో నిలిచింది. అభిమానులకు రంగస్థలం చిత్రం కనెక్ట్ కావడంతో బ్రహ్మరథం పట్టారు.
18 రోజుల కలెక్షన్లు
గత నెల 30 న విడుదలైన రంగస్థలం చిత్రం తిరుగులేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో 106 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రాన్ని అధికమించిన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది.
మహేష్ వచ్చేలోపు ముగించేశారు
ఈ శుక్రవారం ఏప్రిల్ 20 న సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం విడుదల కాబోతోంది. అక్కడితో రంగస్థలం వసూళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లే. కానీ మహేష్ సినిమా వచ్చేలోపే రంగస్థలం చిత్రం చేయాల్సిన పని మొత్తం పూర్తి చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రల్లో రంగస్థలం చిత్రం 78 కోట్ల షేర్ రాబట్టింది. కేవలం నైజాంలోనే 23 కోట్ల షేర్ రాబట్టింది.