Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంగస్థలం కలెక్షన్స్: మహేష్ రాక ముందే పని పూర్తిచేసేసిన రాంచరణ్.. ఆ స్థానం రంగస్థలందే!
Recommended Video
బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం జైత్ర యాత్ర కొనసాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ లోనే ఈ చిత్రం అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రాంచరణ్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 1980 నాటి పల్లెటూరి కథతో సుకుమార్ మ్యాజిక్ చేశాడు. రాంచరణ్ తన నటనతో మంత్ర ముగ్దుల్ని చేశాడు. సమంత, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి ఆకట్టుకునే నటన కనబరచడంతో రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది.
రాంచరణ్ నటనతో, సుకుమార్ కథతో
రంగస్థలం చిత్రానికి ముందు వరకు రాంచరణ్ మాస్ అంశాలున్న కథలు చేశాడు. రంగస్థలం చిత్రంలో పల్లెటూరి యువకుడిగా వినికిడి లోపంతో పెద్ద సాహసమే చేశాడు. రాంచరణ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. కానీ ఆ సాహసాన్ని చరణ్ చిట్టిబాబు పాత్రలో మెప్పించి దిగ్విజయంగా పూర్తి చేసాడు. సుకుమార్ అద్భుత కథతో మ్యాజిక్ చేసాడు.
కలెక్షన్ల సునామి
రంగస్థలం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. బాహుబలి1, 2 తరువాత ఆ స్థానంలో నిలిచింది. అభిమానులకు రంగస్థలం చిత్రం కనెక్ట్ కావడంతో బ్రహ్మరథం పట్టారు.
18 రోజుల కలెక్షన్లు
గత నెల 30 న విడుదలైన రంగస్థలం చిత్రం తిరుగులేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. రంగస్థలం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల్లో 106 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ చిత్రాన్ని అధికమించిన రంగస్థలం చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచింది.
మహేష్ వచ్చేలోపు ముగించేశారు
ఈ శుక్రవారం ఏప్రిల్ 20 న సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం విడుదల కాబోతోంది. అక్కడితో రంగస్థలం వసూళ్ల ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లే. కానీ మహేష్ సినిమా వచ్చేలోపే రంగస్థలం చిత్రం చేయాల్సిన పని మొత్తం పూర్తి చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రల్లో రంగస్థలం చిత్రం 78 కోట్ల షేర్ రాబట్టింది. కేవలం నైజాంలోనే 23 కోట్ల షేర్ రాబట్టింది.