Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రంగస్థలం’ షూటింగ్ జరిగిన చోటే భారీ విషాదం, నిర్మాతల సంతాపం!
ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై జరిగిన బోటు ప్రమాదంలో దాదాపు 36 మంది గల్లంతయిన సంగతి తెలిసిందే. గల్లంతయిన వారంతా మరణించినట్లు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం నుండి దేవీపట్నం వెళుతున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే 'రంగస్థలం' షూటింగ్ జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మైత్రిమూవీ మేకర్స్ స్పందించారు. ఈ ప్రాంతంలోనే మేము రంగస్థలం సినిమా చిత్రీకరించాము. ప్రమాద ఘటన తమను ఎంతో బాధిచిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నేవీ అధికారులు, గజ ఈతగాళ్లు గల్లంతైన వారి కోసం నదిని జల్లెడపడుతున్నారు. భారీ క్రేన్ల సహాయంతో నదిలో సుమారు 60 అడుగుల లోతులో మునిగిపోయిన లాంచీని వెలికి తీశారు. కొన్ని మృతదేహాలు లాంచీలోనే ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రమాదంపై 'రంగస్థలం' నటులు రామ్ చరణ్, సమంత, అనసూయ తదితరులు విచారం వ్యక్తం చేశారు. షూటింగ్ జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతున్నాయని, ఈ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని చిత్ర యూనిట్ విచారం వ్యక్తం చేశారు.