బుల్లితెరపై రాంచరణ్ సునామి.. రంగస్థలం కళ్ళు చెదిరే రికార్డ్!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చివరగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులని తిరగరాసింది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ 1980 కాలం నాటి కథతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే. చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తాజాగా రంగస్థలం చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది.

అదరగొట్టిన రంగస్థలం
రంగస్థలం చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయింది. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తరువాత రెండవ అతిపెద్ద విజయంగా ఈ చిత్రం నిలిచింది. 200 కోట్లకు పైగా గ్రాస్, 120 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. సుకుమార్ దర్శకత్వం, కథని నడిపించిన విధానం, రాంచరణ్ నటనతో ఇంతటి ఘనవిజయం సాధ్యం అయింది.

బుల్లితెరపై సునామి
రంగస్థలం చిత్ర రికార్డులు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ఈ చిత్రాన్ని బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రానికి అత్యధిక టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. 19.5 రంగస్థలం చిత్రానికి టిఆర్పి రేటింగ్ నమోదైంది.

అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా
రంగస్థలం చిత్రంలో ప్రతి పాత్రని సుకుమార్ అద్భుతంగా మలిచారు. మాస్ ఆడియన్స్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడం విశేషం. రాంచరణ్ తో పాటు సమంత, జగపతి బాబు, ఆది పెనిసెట్టి, రంగమత్తగా అనసూయ అద్భుత నటన కనబరిచారు.

బోయపాటి సినిమాతో
ప్రస్తుతం రాంచరణ్ బోయపాటి దర్శత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











