Don't Miss!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రంగస్థలం ఒక క్లాసిక్ అవుతుంది: చిరంజీవి, మెగాస్టార్కి రామ్ చరణ్ సినిమా నచ్చేసింది
ఇప్పటివరకూ పూర్తయిన రంగస్థలం 1985 భాగానికి రషెస్ ను ప్రత్యేకంగా చూశారట మెగాస్టార్ చిరంజీవి. రాజమౌళి తో కలిసి రషెస్ను చూసి.. ఈ మూవీ ఓ క్లాసిక్ గా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని చెప్పారట చిరు.
Recommended Video
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ రంగస్థలం 1985. ఇప్పటికి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా ముప్ఫై ఏళ్ల క్రితం నాటి కథతో పీరియాడిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ అంతటా ఆసక్తి ఉంది.
డైరెక్టర్ సుకుమార్
ఇప్పటివరకూ సిటీ బేస్డ్ సినిమాలే తీసిన ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్.. తొలిసారిగా పూర్తి స్థాయిలో పల్లెటూరి నేపథ్యంలో మూవీ తీస్తుండడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తన వారసుల విషయంలో చిరు జడ్జిమెంట్ ఆకట్టుకుంటుంది.
ఎవడు మూవీ ఆడియో ఫంక్షన్
ఎవడు మూవీ ఆడియో ఫంక్షన్ లో.. సరైనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి చెప్పిన మాటలు ఆయా సినిమాలకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు తన కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం విషయంలో కూడా మెగాస్టార్ బోలెడంత మక్కువ చూపిస్తున్నారట.
ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసేస్తున్నారు
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆయనకు విపరీతంగా నచ్చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ సమంత కూడా షూటింగ్కు అటెండ్ అవుతుండడంతో.. రంగస్థలం షూటింగ్ను ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసేస్తున్నారు. అయితే.. ఇంకా పలు సన్నివేశాలతో పాటు.. నాలుగు పాటలను కూడా చిత్రీకరించాల్సి ఉందట.
మెగాస్టార్ చిరంజీవి
కానీ ఇప్పటివరకూ పూర్తయిన భాగానికి రషెస్ ను ప్రత్యేకంగా చూశారట మెగాస్టార్ చిరంజీవి. రాజమౌళి తో కలిసి రషెస్ను చూసి.. ఈ మూవీ ఓ క్లాసిక్ గా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని చెప్పారట చిరు. టాలీవుడ్ ఆడియన్స్ కు రంగస్థలం ఓ విజువల్ ట్రీట్ లా ఉంటుందని దర్శకధీరుడు చెప్పడంతో.. ప్రస్తుతం రంగస్థలం టీం ఫుల్ ఖుషీలో ఉన్నట్లు టాక్.
ఓ విజువల్ ట్రీట్
మరోవైపు రాజమౌళి కూడా రంగస్థలం ఔట్ పుట్ చూసి చాలా ఎక్సయిట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ విజువల్ ట్రీట్ లా నిలుస్తుందని.. ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ అందరినీ అలరిస్తుందని కామెంట్ చేశాడట దర్శక ధీరుడు.
పవర్ స్టార్ మూవీ రంగస్థలం
ఇండస్ట్రీ దిగ్గజాల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడంతో.. ఇప్పుడు రంగస్థలం టీమ్ తెగ హ్యాపీగా ఫీలయిపోతోంది. వచ్చే ఏడాది మార్చ్ నాటికి మెగా పవర్ స్టార్ మూవీ రంగస్థలం ను రిలీజ్ చేయాలన్నది టార్గెట్. సో..! ఖచ్చితమైన నమ్మకంతోనే రంగస్థలం రెడీ చేస్తున్నారట .