Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నందిగామలో మధ్యలో నిలిచిపోయిన రంగస్థలం చిత్రం..ఉద్రిక్త పరిస్థితి!
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం ఉండడంతో తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా నందిగామలో మయూరి థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పరిమితికి మించిన ధరలతో రంగస్థలం చిత్ర టికెట్స్ ని విక్రయిస్తోందని ఫిర్యాదు కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో థియేటర్ కు వెళ్లారు. తనిఖీ పేరుతో రంగస్థలం చిత్ర ప్రదర్శనాని మధ్యలో ఆపివేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.