Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
నందిగామలో మధ్యలో నిలిచిపోయిన రంగస్థలం చిత్రం..ఉద్రిక్త పరిస్థితి!
రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగానే చిత్రం ఉండడంతో తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. దీనితో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ నటన, దర్శకుడు సుకుమార్ టేకింగ్, సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు పెర్ఫామెన్స్ చిత్రాన్ని మరో లెవల్ కు తీసుకుని వెళ్లాయని ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇదిలా ఉండగా కృష్ణ జిల్లా నందిగామలో మయూరి థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. థియేటర్ యాజమాన్యం పరిమితికి మించిన ధరలతో రంగస్థలం చిత్ర టికెట్స్ ని విక్రయిస్తోందని ఫిర్యాదు కలెక్టర్ కు చేరింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో థియేటర్ కు వెళ్లారు. తనిఖీ పేరుతో రంగస్థలం చిత్ర ప్రదర్శనాని మధ్యలో ఆపివేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.