Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఫోటో వైరల్: సొంతగా ప్రైవేట్ విమానం బుక్ చేసుకున్న మెగా ఫ్యామిలీ....
Recommended Video
రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్లో ఆదివారం గ్రాండ్గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో చిరంజీవితో పాటు సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, శ్రీజతో పాటు ఆమె భర్త కల్యాణ్, మెగా ఫ్యామిలీ కిడ్స్ హాజరైన సందడి చేశారు.
ప్రత్యేక విమానంలో
ఈ వేడుకలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వైజాగ్కు ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుని వెళ్లారు. రోడ్డు మార్గాన వెళితే చాలా సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల ఇలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఆదివారం రాత్రి అక్కడే...
ఆదివారం సాయంత్రం హైదరబాద్ నుండి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ‘రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన అనంతరం రాత్రి వైజాగ్ లోనే బస చేశారు. సోమవారం ఉదయం అంతా కలిసి మళ్లీ అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
ఫోటోస్ వైరల్
మెగా ఫ్యామిలీ ప్రైవేట్ జెట్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. మెగా ఫ్యామిలీ తమ రేంజికి తగిన విధంగా ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లారని చర్చించుకుంటున్నారు అభిమానులు. ఈ ఫోటోలో చిరంజీవి తన కాలును కొడుకు చరణ్ కాలుపై పెట్టి ఫోటోలకు ఫోజు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.
రంగస్థలం
రంగస్థలం సినిమా విషయానికొస్తే ఈ చిత్రం మార్చి 30న విడుదల సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ ఇప్పటి వరకు వచ్చిన రామ్ చరణ్ సినిమాలన్నింటినీ మించి పోయేలా అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.