Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రహస్యంగా..నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణి ముఖర్జీ
హైదరాబాద్: ధూమ్-3 చిత్ర నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా....హీరోయిన్ రాణీ ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంత కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ విషయం అధికారికంగా ఖరారైంది.
ఈ మేకు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నుండి ప్రకటన వెలవడింది. నిన్న రాత్రి (ఏప్రిల్ 21) ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వివాహం జరిగినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కేవలం కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సంక్షంలో సింపుల్గా ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలిపారు.
ఆదిత్య చోప్రాకు ఇది రెండో వివాహం. గతంలో ఆయన పాయల్ ఖన్నాను పెళ్లాడారు. అయితే 2009లో ఆమెతో విడిపోయారు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా...రాణిముఖర్జీకి దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ...సహజీవనం వరకు వెళ్లింది. వీరిద్దరు గత కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా వీరి సంబంధంపై సంతృప్తిగానే ఉంటున్నారు.
గత సంవత్సరం జులై నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణి ముఖర్జీ చేతికి ఖరీదైన డైమండ్ రింగ్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలమయ్యాయి. అయితే పెళ్లి జరిగే వరకు ఈ విషయాన్ని వాస్త గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వాస్తవానికి వీరి పెళ్లి ఇప్పటికే జరుగాల్సి ఉండగా....యశ్ చోప్రా మరణంతో వాయిదా పడిందని అంటున్నారు.
రాణి ముఖర్జీ యష్ రాజ్ ఫ్యామిలీ క్లోజ్ ఉంటూ వస్తోంది. వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా...ఏలాంటి సెలబ్రేషన్స్ జరిగినా రాణి తప్పకుండా హాజరవుతుంది. ఆ మధ్య ఆదిత్య చోప్రా తండ్రి యష్ చోప్రా ఆసుపత్రిలో చేరినప్పటి నుండే ఆమె తన ఈవెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని దగ్గరుండి చూసుకుందట. ఆయన మరణించిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన కుటుంబంతోనే గడిపింది.