Don't Miss!
- Sports IPL 2024: ఐపీఎల్ విజేతగా నిలిచేది ఆ జట్టే- రికీ పాంటింగ్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- News మాకు ఏమిచ్చారని మీకు ఓటేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Automobiles బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
మసాలా సాంగుతో మత్తెక్కిస్తున్న రాణి ముఖర్జీ
ముంబై: సినిమాల్లో ఇప్పుడు ఐటం సాంగులకు భలే డిమాండ్ ఉంది. గతంలో ఈ మసాలా సాంగులు చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండే వారు. కానీ ఇప్పుడు కత్రినా కైప్, కరీనా కపూర్, విద్యా బాలన్ లాంటి హీరోయిన్లు సైతం ఐటం సాంగులు చేయడానికి సై అంటూ వెండి తెరను ఓ వూపు ఊపుతున్నారు.
తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ రాణి ముఖర్జీ కూడా చేరింది. ఈ భామ ఏకంగా ఒకే సినిమాలో మూడు ఐటం సాంగులతో ఐటం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సుందరి 'ఏయ్యా' అనే ఓ బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. దక్షిణాది సినిమా పరిశ్రమ నేపథ్యంలో నడిచే కథ ఇది.
అనురాగ్కశ్యప్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణి ముఖర్జీ హీరోయిన్ కావాలని కలలుగనే మధ్యతరగతి అమ్మాయి పాత్రను పోషిస్తోంది. అంతేకాదు పాత్రకనుగుణంగా మూడు ఐటమ్సాంగ్స్లో నర్తించనుంది. ఐటం సాంగులు చేయడంపై రాణి ముఖర్జీ మాట్లాడుతూ 'ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేయాలంటే బోర్కొడుతోంది. నటిగా నా ప్రతిభ ఏమిటో కొత్తగా నిరూపించుకోవాల్సివ అవసరం లేదు. అందుకే కమర్షియల్ విలువలున్న 'ఏయ్యా' సినిమా చేస్తున్నాను. పూర్తిస్థాయి హాస్య చిత్రమిది. ఇందులో తొలిసారి ఐటమ్సాంగ్స్ చేస్తున్నాను. నేను చేసే బెల్లి నృత్యం ప్రత్యేకార్షణగా నిలుస్తుంది' అని చెప్పింది.
'బ్లాక్' 'నో వన్ కిల్డ్ జెస్సీకా'లాంటి చిత్రాల్లో అద్భుతాభినయం కనబర్చిన రాణి ముఖర్జీ విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తీవ్ర భావోద్వేగాలున్న పాత్రలు చేయడం తనకు రొటీన్ అయిపోయిందని అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది రాణిముఖర్జీ. అందుకే పంథా మార్చుకొని కమర్షియల్ చిత్రాల వైపు దృష్టిసారిస్తానని చెబుతోంది.