Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఫిదా చేసిన చూపులేని చిన్నారి.. విజిల్స్తో మోతెక్కిపోయిన ఆడియో వేడుక!
పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన దిలీప్ కుమార్ సాల్వడి హీరోగా మారి నటిస్తున్న చిత్రం దిక్సూచి. ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆడియో వేడుకలో చోటు చేసుకున్న అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్ర ఆడియో వేడుకలు అమ్మ ఫౌండేషన్ తరుపున కొందరు చూపులేని చిన్నారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆడియో వేడుకలో పాల్గొన్న చూపులేని చిన్నారి శ్నియకు నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సస్పెన్స్ థ్రిల్లర్గా
ముందుగా దిక్సూచి చిత్రం గురించి మాట్లాడుకుంటే.. ఆధ్యాత్మిక అంశాలతో శివలింగం చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రాబోతోంది. టీజర్ లో చూపిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. సస్పెన్స్ అంశాలతో పాటు, ఎమోషనల్ అంశాలు కూడా ఈ చిత్రంలో హైలైట్ కానున్నాయి. దిలీప్ కుమార్ ఏ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకుడిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.
ఆకట్టుకుంటున్న పాటలు
దిక్సూచి చిత్రంలో పాటలన్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక భావాల్ని తట్టిలేపే విధంగా ఈ చిత్రానికి భరద్వాజ్ సంగీతం అందించారు. బిత్తిరి సత్తి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అతడు ఓ పాట కూడా పాడడం విశేషం. ఇక ఆడియో వేడుకలో చిత్ర యూనిట్ చూపులేని చిన్నారుల చేత ఓ పాటని లాంచ్ చేయించారు. అమ్మ ఫౌండేషన్ తరుపున ఈ చిన్నారులు ఆడియో వేడుకకు హాజరయ్యారు.
అంతా ఫిదా
ఈ చిత్రంలో హరిణి 'నీలోని సిలకమ్మ' అనే పాటని పాడింది. హరిణి పాడిన తర్వాత చూపులేని చిన్నారి శ్నియ ఆ పాటని పాడింది. శ్నియ గాత్రానికి అక్కడున్నవారంతా ఫిదా అయిపోయారు. వినసొంపుగా ఉంటూ, ఆహ్లాదంగా సాగిపోయా పాట అది. సాధారణంగా అయితే ఎవరూ ఆపాటకు విజిల్స్ వేయరు. కానీ ఆ చిన్నారి అద్భుతంగా పడుతుండడంతో ఆడియో వేడుకలో ఉన్న ప్రతి ఒకరిలో ఉత్తేజం రేకెత్తింది. కేకలు, విజిల్స్ వేస్తూ ఆ చిన్నారికి తమ హర్షాన్ని తెలియజేశారు. చప్పట్లతో ఆడియో వేడుక మారుమోగిపోయింది.
వైరల్ అవుతున్న దృశ్యాలు
ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్నియని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహరాజు ఈ చిత్రానికి నిర్మాతలు. ఉత్కంఠ భరిత అంశాలతో ఆసక్తి రేపుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.