Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అప్పుడలా అన్నారు.. ఇప్పుడిలా ట్రీట్ చేస్తున్నారు.. రష్మీ గౌతమ్ అసహనం
దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కాలంగా నాన్చుతూ వచ్చిన ఈ సున్నితమైన కేసు ముగియడంతో పలువురు సెలెబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ స్పందించింది. వివరాల్లోకి పోతే..
వివాదానికి ఫుల్స్టాప్.. చారిత్రాత్మక తీర్పు
వివాదాస్పదంగా మారిన రామజన్మ భూమి, బాబ్రీ మసీద్కు సంబంధించిన 2.77 ఎకరాల భూమిని రామమందిర నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జిస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించింది.
|
జై శ్రీరామ్ అంటూ రష్మీ గౌతమ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా సెలెబ్రెటీల్లో జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు. ముఖ్యంగా సామాజిక అంశాల పట్ల స్పందించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ బాటలోనే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన అయోధ్య కేసు తీర్పుపై కూడా రియాక్ట్ అయింది. ఈ మేరకు ట్విట్టర్లో జై శ్రీరామ్ అంటూ ఓ పోస్టు పెట్టింది.
సోషల్ ఫాలోయింగ్ ఎక్కువ.. అందుకే
సాధారణంగానే రష్మీ గౌతమ్కి ఫాలోయింగ్ ఎక్కువ. ఆమె పెట్టే సోషల్ మీడియా పోస్టులను బాగా ఫాలో అవుతుంటారు నెటిజన్లు. ఈ కోవలోనే తాజాగా అయోధ్య తీర్పుపై ఆమె చేసిన ట్వీట్ పై లైకులు కురిపించారు ఆన్లైన్ వీరులు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఎలాంటి విషయమైనా రష్మీ స్పందించే తీరు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
|
నెటిజన్ ప్రశ్న.. అంటే మీ ఉద్దేశం అంటూ
కాగా రష్మీ పెట్టిన ఈ ట్వీట్ చూసిన ఓ నెటిజన్.. ఆమెను ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. మేడమ్ ఇలాంటి ట్వీట్స్ పెట్టే ముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని మొత్తం చదవాలన్నాడు. మీ ఉద్దేశం ప్రకారం అక్కడ ముస్లీంలు బాబ్రీ మసీదు కట్టి తప్పు చేశారా అని ప్రశ్నించాడు.
|
గతంలో అలా అన్నారు.. ఇప్పుడిలా ట్రీట్ చేస్తున్నారు
నెటిజన్ అడిగిన ఈ ప్రశ్నపై రష్మీ గౌతమ్ ఘాటుగా రియాక్ట్ అయింది. ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేయొద్దని, గతంలో దీపావళి సమయంలో క్రాకర్స్ను కాల్చొద్దని అంటే నాపై హిందూ వ్యతిరేకి అని ముద్రవేశారని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుకూలవాదినని అంటున్నారని మండిపడింది. తాను ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకించడం లేదని ఆమె తెలిపింది.