Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఈ ఒక్కసారికి అలాంటివి వదిలేయండి.. రష్మీ గౌతమ్ సెన్సేషనల్ కామెంట్
రష్మీ గౌతమ్.. ఈ పేరు వింటే చాలు నెటిజన్లలో పూనకం వచ్చేస్తుంది. బుల్లితెర, వెండితెరతో పాటు ఆన్లైన్ తెరపై కూడా భారీ పాపులారిటీ సంపాదించింది ఈ జబర్దస్త్ భామ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తూ వస్తున్న ఈమె.. తాజాగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అయింది. రష్మీ గురించి చర్చించుకునేలా చేసింది. ఇంతకీ ఏమిటా పోస్ట్? అందులో ఏముంది? వివరాల్లోకి పోతే..
సాటి మనిషిగా ఆలోచించి.. రష్మీ గౌతమ్
అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నేటి సమాజ పరిస్థితులను అన్వయిస్తూ ఆలోచన చేసింది రష్మీ గౌతమ్. పేదవారికి ఈ రకంగా అయినా సహాయ పడండి అంటూ సాటి మనిషిగా తన మానవత్వాన్ని చాటుకుంది. దీంతో ఆమె పట్టిన పోస్ట్ నెట్టింట సెన్సేషన్గా మారింది.
దీపావళి డిమాండ్.. షాపింగ్ మాల్స్
మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు చేసుకోనున్నారు జనం. దీపావళి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి టపాసులు. వీటితో పాటు దీపం వత్తులు, దివ్వెలు ఇలా ఎన్నో రకాల ఉత్పతులకు దీపావళి సందర్బంగా డిమాండ్ నెలకొంటుంది. నేటి సమాజంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెలియడంతో వీటిని కొనుగోలు చేయడానికి అక్కడికే వెళ్తుంటారు జనం. దీంతో షాపింగ్ మాల్స్ అన్నీ కళకళలాడుతుంటాయి.
అందరికీ తెలిసీ తెలియని విషయం.. ఫుట్పాత్లపై రేయింబవళ్లు
కానీ, అందరికీ తెలిసీ తెలియని మరో విషయం ఏంటంటే.. ఈ దీపావళి మార్కెట్ని నమ్ముకొని ఎన్నో పేద కుటుంబాలు ఆశలు పెట్టుకుంటాయి. దివ్వెలు, దీపం వత్తులు, టపాసులు అమ్ముకొని కొంతైనా డబ్బు సంపాదించుకొని జీవితం వెళ్లదీయాలని ఆరాట పడుతుంటాయి. ఈ మేరకు ఆయా వస్తువులను అమ్మడానికి ఫుట్పాత్లపై రేయింబవళ్లు కష్టపడుతుంటాయి.
|
ఆలోచన కలిగించే విధంగా రష్మీ
అలాంటి వారి గురించి తెలుపుతూ రష్మీగౌతమ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మట్టిదివ్వెలు చేస్తున్న ఓ ముసలాయన ఫోటో, అలాగే ఫుట్పాత్పై టపాసులు అమ్ముతున్న ఓ మహిళ ఫోటో షేర్ చేస్తూ అద్భుతమైన, ఆలోచన కలిగించే ట్వీట్ చేసింది రష్మీ.
ఒక్కసారిగా అందరి కళ్ళు తెరిపించిన రష్మీ
ఈ దీవాళికి షాపింగ్ మాల్స్ను వదిలేసి లోకల్ ఏరియాలలో షాపింగ్ చేయండి అని పేర్కొంది రష్మీ గౌతమ్. దీంతో ఈ ట్వీట్ ఒక్కసారిగా అందరి కళ్ళు తెరిపించింది. రష్మీ ఆలోచనకు, చైతన్య పరిచే విధానానికి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. లైకుల మీద లైకులు కొడుతూ రష్మీ దీపావళి ట్వీట్ వైరల్గా మార్చేశారు. ఎంతైనా ఈ రకంగా ప్రజలను మోటివేట్ చేస్తుందంటే.. రష్మీలో సమాజానికి ఉపయోగపడే చాలా సుగుణాలు ఉన్నాయన్నట్లే మరి.