లేగదూడపై లైంగిక దాడి.. వీడియో కంటపడటంతో రష్మీ సెన్సేషనల్ కామెంట్స్
జబర్దస్త్ యాంకర్గా, వెండితెరపై అందాల ఆరబోతను ప్రదర్శించే రష్మీ గురించి అందరికీ తెలిసిందే. అయితే రష్మీలో మరో కోణం ఉంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ.. నోరులేని మూగజీవాల కోసం గళం విప్పుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో మూగ జీవాల గురించి స్పందిస్తూ అందరికీ అవగాహన కలిగిస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్..
క్షణం తీరిక లేకుండా గడిపే ఫేమస్ యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. నెగెటివ్ కామెంట్స్ చేసే నెటిజన్లకు కౌంటర్స్ వేస్తుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తూ.. ఫోటో షూట్లతో హల్చల్ చేస్తూ ఉంటుంది.

తాజాగా హోలీపై..
తాజాగా రష్మీ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రంగులు మనుషుల మీద చల్లండి.. జంతువుల మీద చల్లకండి అవి కడుక్కోలేవు అంటూ రష్మీ హితబోద చేసింది. కొంత మంది నెటిజన్లు నెగెటివ్గా కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది.
లేగదూడపై లైంగిక దాడి..
ఓ యువకుడు లేగ దూడపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలోపోస్ట్ చేశాడు. దాంతో పాటు నరేంద్రమోడీ, శ్రద్దా కపూర్, రష్మీ వంటి వారికి ట్యాగ్ చేశాడు. రష్మీ ఈ వీడియోపై స్పందిస్తూ ఓ కామెంట్ చేసింది.
Recommended Video

మనం ఎక్కడికి వెళ్తున్నాం..
లేగదూడపై యువకుడి లైంగిక దాడి నారాయణ గూడలో జరినట్టు తెలుస్తోంది. ఈ వీడియో రష్మీ స్పందిస్తూ.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. ఏ రకంగా ప్రవర్తిస్తున్నామంటూ ఆవేదన చెందినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











